పీఎం కిసాన్ నిధులు జమ కాలేదా - అయితే, ఇలా చేస్తే వెంటనే..!!
పీఎం కిసాన్ నిధుల పై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 13న ప్రధాని మోదీ గౌహతి లో 22వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేసారు. దేశ వ్యాప్తంగా అర్హత సాధించిన రైతుల ఖాతా ల్లో ఒకే సారి నిధులు జమ అయ్యాయి. ఏపీలో పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల ను ఖాతాల్లో వేసారు. అయితే, పీఎం కిసాన్ నిధుల అందని రైతులకు కీలక సూచన చేస్తున్నారు. ఫోన్ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయటంతో సమస్య పరిష్కరించుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబర్లను ప్రకటించారు.
ప్రధాని మోదీ 22వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేసారు. రైతుల ఖాతాల్లో ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో మూడో విడతగా రూ 2 వేలు జమ చేసారు. దీని ద్వారా దాదాపు రూ.18,640 కోట్లను కేంద్రం రిలీజ్ చేసింది. సుమారు 9 కోట్ల 32 లక్షల మంది రైతులకు ఈ విడతలో రూ.2 వేల చొప్పున అందించారు. అయితే, అర్హత ఉన్నా తమ ఖాతాల్లో నిధులు జమ కాలేదని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి కోసం అధికార యంత్రాంగం కీలక సూచన చేస్తోంది. నిధులు రాని వారు హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. పీఎం కిసాన్ లబ్దిదారుల జాబితాలో పేరు ఉండి డబ్బులు పొందేందుకు అర్హత ఉన్నా నిధులు జమ కాకుంటే ఈమెయిల్, టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన హెల్ప్లైన్ నంబర్లు 155261, 1800115526 లేదా 011-23381092 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు[email protected]కి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

నిధులు అందకపోతే వెంటనే ఇలా చేస్తే..
ఈ నెంబర్లకు కాల్ చేయటం ద్వారా అర్హత ఉన్నా.. నిధులు ఎందుకు అందలేదనే సమాచారం రైతులు తెలుసుకోవచ్చు. ఆ కారణం తెలుసుకుని సమస్యను పరిష్కరించుకుంటే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇప్పటికే కేంద్రం పలుమార్లు రైతులకు కేవైసీ గురించి హెచ్చరిక చేసింది. అర్హత ఉన్న ప్రతీ రైతు.. కేవైసీ చేయకపోతే పీఎం కిసాన్ నిధులు జమ కావని స్పష్టం చేసింది. ఇలాంటి రైతులకు ఈ సారి నిధులు నిలిచిపోయాయి. ఏడాదిలో ఒకసారి పీఎం కిసాన్ వెబ్ సైట్లోకి వెళ్లి ఈకేవైసీ అప్డేట్ చేయాలి. ఇలా చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశముంది. ఇక ఈకేవైసీ, బ్యాంక్ అకౌంట్లో ఏమైనా లోపాలు ఉన్నా నిలిచిపోవచ్చు. ఇక మీ బ్యాంక్ అకౌంట్ను ఈకేవైసీ, ఆధార్తో లింక్ చేయకపోవడం వల్లన నిధులు నిలిచిపోతాయి. ఇక ల్యాండ్ రికార్డుల్లో తప్పులు ఉండటం వల్ల కూడా పీఎం కిసాన్ జమ కావని అధికారులు చెబుతున్నారు. కేంద్రం ఖరారు చేసిన నిబంధనలకు అర్హత ఉండీ.. నిధులు జమ కాకుంటే, వారి ఫిర్యాదు ఆధారంగా వెంటనే నగదు క్రెడిట్ చేస్తారని అధికారులు వెల్లడించారు.
-
MRO అధికారాలు, నెల జీతం ఎంతో తెలుసా..? -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!













Click it and Unblock the Notifications