టీడీపీ-వైసీపీ ఏమైనా చేసుకోనివ్వండి: కొత్తపల్లి గీతతో మోడీ ఇలా.., 'జగన్ పార్టీని మూసేస్తారా'
న్యూఢిల్లీ: అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత ప్రధాని నరేంద్ర మోడీకి థ్యాంక్స్ చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఏడాది కూడా ఎక్కువ నిధులు ఇవ్వాలని ప్రధాని మోడీని కోరినట్లు బుధవారం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరించానన్నారు.

నరేంద్ర మోడీ నాతో చెప్పారు
విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని కోరినట్లు కొత్తపల్లి గీత తెలిపారు. ఏపీ ప్రజలకు పూర్తి న్యాయం చేస్తానని ప్రధాని మోడీ అన్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నానని మోడీ తనతో చెప్పారన్నారు.

టీడీపీ, వైసీపీలు ఎవరు ఏం చేసినా
విభజన గాయాలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని తాను కోరినట్లు తెలిపారు. ఏపీకి మేలు చేయాలనే మేం ఉన్నామని, టీడీపీ, వైసీపీలు రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నాయని, ఎవరు ఎలా చేసినా మేం మాత్రం ఏపీకి న్యాయం చేస్తామని మోడీ చెప్పారని కొత్తపల్లి గీత అన్నారు.

చంద్రబాబు బినామీ పత్తిపాటి
ఇదిలా ఉండగా, మంత్రి పత్తిపాటి పుల్లారావు సీఎం చంద్రబాబు నాయుడుకి బినామీగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత వైయస్ జగన్ విమర్శించారు. గత ప్రభుత్వం పేదలకు భూములిస్తే వాటిని లాక్కొని మంత్రి పత్తిపాటి మైనింగ్కు వాడుకుంటున్నారని, ఇసుకను అమ్ముకుంటున్నారన్నారు. వచ్చిన సొమ్మును పుల్లారావు, మంత్రి లోకేష్ పంచుకుంటున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి ఆ భూములను తక్కువ రేటుకు కొనుక్కుంటున్నారన్నారు.

జగన్కు సవాల్
దీనిపై పత్తిపాటి గురువాలం సవాల్ విసిరారు. తనపై జగన్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని, వాటిని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకుంటే జగన్ వైసీపీని మూసుకుంటారా అన్నారు. అలాగే, జర్నలిస్టులను హత్యలు చేయించే సంస్కృతి తనది కాదని చెప్పారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications