సీమాంధ్రులంతా గెస్ట్ ఆర్టిస్టులే: పోచారం, మాఫీపై క్లారిటీ

తెలంగాణలో రుణాల మాఫీపై వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. రెండు మూడు రోజుల్లో రుణమాఫీపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. 2008 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ అయ్యాయని, 2008 తర్వాత తీసుకున్న పంట రుణాలను అన్నింటినీ మాఫీ చేస్తామని ఆయన చెప్పారు.
ఇచ్చిన మాట ప్రకారం రుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం అన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసిందని, బ్యాంకుల నుంచి కొంత సమాచారం రావాల్సి ఉందని ఆయన చెప్పారు. ఎల్లుండి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రానికి వస్తున్నట్లు ఆయన తెలిపారు.
రుణమాఫీపై మంత్రి వర్గ సమావేసంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోచారం చెప్పారు. ఇదిలావుంటే, బ్యాంకులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications