Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బడ్జెట్ కు ముందే ఏపీకి కేంద్రం భారీ వరం, కీలక మలుపు..!!

ఏపీకి కేంద్రం భారీ వరం ప్రకటించింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి కొంత కాలంగా తగిన ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్దికంగా తోడ్పాటు అందిస్తోంది. అమరావతి.. పోలవరం విషయంలో ఏపీ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర వేస్తోంది. అందులో భాగంగా కేంద్రం ఈ రోజు ప్రవేశ పెట్టే బడ్జెట్ వేళ ఏపీకి కీలక సమాచారం అందుతోంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కోసం భారీ గా నిధుల కేటాయింపుకు ఆమోదం లభించింది. దీంతో, నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం సహకరించనుంది.

బడ్జెట్ కు ముందే కేంద్రం ఏపీకి మరో వరం ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టును కేంద్రం అత్యం త ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.ఇటీవల అమరావతిలో 14 బ్యాంకుల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు, పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరా తీశారు. అప్పటి షెడ్యూల్‌ను బట్టి 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని ఆమెకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అయితే..గోదావరి పుష్కరాల నాటికే పోలవరాన్ని పూర్తి చేయాలని సీఎంకు నిర్మల సూచించారు.

polavaram-union-govt-approves-to-allocate-rs-3000-cr-for-completion-of-project-works-and-rr-package

దీంతో.. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్‌కల్లా పూర్తి చేయాలంటూ జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థలకు చంద్రబాబు నిర్దేశించారు. గత నెల పోలవరం ప్రాజెక్టు క్షేత్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు, కీలకమైన డయాఫ్రమ్‌ వాల్‌ ఫిబ్రవరి నెలాఖరునాటికి పూర్తవుతుందని ..గ్యాప్‌ -1, గ్యాప్‌-2 పనులు సహా డయాఫ్రమ్‌వాల్‌పై ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయగలమని కాంట్రాక్టు సంస్థ తెలిపింది.

కేంద్ర నిధులు మంజూరు

కాగా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలలో ఎలాంటి అవరోధాలు రానివ్వబోమని రాష్ట్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలశక్తి శాఖ స్పష్టంచేసింది. అందులో భాగంగా తాజాగా జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి కాంతారావును ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నరసింహమూర్తి, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ కలిశారు. మూడో విడత కింద రూ. 3,000 కోట్లు ఇవ్వాలని కాంతారావును రొనాల్డ్‌ రోస్‌ కోరారు. ఈ నిధులు మంజూరు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంతారావు వివరించారు. చెరో రూ.1,500కోట్లు చొప్పున రూ.3,000 కోట్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ నిర్మాణ పనుల తీరుపై నరసింహమూర్తిని కాంతారావు ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది మార్చి లేదా జూన్‌ నాటికి పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తంచేశారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ డిజైన్లను కేంద్ర జల సంఘం ఆమోదించాల్సి ఉం దని నరసింహమూర్తి వివరించారు. దీంతో .. నిధుల విడుదలతో సహా డిజైన్లను కూడా వీలైనంత వేగంగా ఆమోదం తెలుపుతామని వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+