యమదొంగ సినిమాలో లాగా చేయబోయి చిక్కిన నకిలీ బాబా
హైదరాబాద్: యమదొంగ సినిమాలో లాగా మహిళలను మోసం చేయాలని ప్రయత్నించి ఓ నకిలీ బాబా పోలీసులకు దొరికిపోయాడు. కృష్ణలంకలో ఆ నకిలీబాబు గుట్టును పోలీసులు రట్టు చేశారు. డబ్బాలో బంగారం, డబ్బులు వేసి పూజలు చేస్తే 3 రోజుల తర్వాత రెట్టింపు అవుతాయని నకిలీ బాబా ప్రచారం చేశాడు.
అతని మాటలు నమ్మి కొంత మంది మహిళలు బంగారాన్ని, డబ్బును ఆ డబ్బాలో వేసి అతనికి ఇచ్చి పూజలు చేయాలని అడిగారు. మూడు రోజుల తర్వాత కొంత మంది మహిళలకు రెట్టింపు డబ్బును ఇచ్చాడు. ఆ విధంగా పెద్ద మొత్తంలో డబ్బు జమచేశాడు.
అలా జమైన తర్వాత దాన్ని తిరిగి ఇవ్వకుండా మరింత బంగారం, డబ్బు తెచ్చి వేస్తే మరింత ఎక్కువగా వస్తాయని నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు అతని చేతిలో మోసపోయామని గుర్తించిన పోలీసులు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతని గుట్టును విప్పారు.
గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్లో విషాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం బీచ్లో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. జిల్లాలోని కాకుమానుకు చెందిన రత్నం, లక్ష్మీనారాయణ బీచ్కి స్నానానికి వెళ్లి అలల దాటికి మునిగిపోయి మరణించారు.