ఆటో డ్రైవర్లకు అలర్ట్.. ఇక ఏఐతో నిఘా
నగరాల్లో నేరాలకు కొత్త దారులు కనిపెడుతున్న నిందితులను కట్టడి చేయడానికి పోలీసులు కూడా అదే స్థాయిలో సాంకేతికతను ఆయుధంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నచిన్న నేరాల నుంచి భారీ చోరీల వరకు... నిందితులు పారిపోవడానికి ఎక్కువగా బైక్ లను, ఆటోలను ఉపయోగిస్తున్నారని గుర్తించిన పోలీసులు, ముందుగా ఆటోలపై పూర్తిస్థాయి నిఘా పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే ఒక వినూత్న ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారు.
గత నెల 31వ తేదీ రాత్రి నున్న స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ ఇంట్లో 20 కాసుల బంగారం చోరీకి గురైంది. సంఘటన తర్వాత పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించగా, ఓ వ్యక్తి దొంగతనం చేసి ఆటోలో జంప్ అయ్యాడు. ఇదంతా సీసీ టీవీలో రికార్డైంది. ఆటోపై ఉన్న కొన్ని గుర్తులు కనిపించినప్పటికీ, అర్ధరాత్రి చీకట్లో ఆటో నంబరు స్పష్టంగా కనిపించలేదు. దీంతో దర్యాప్తు కొంత క్లిష్టంగా మారింది.

డైటా బేస్..
ఈ సంఘటనతో పాటు ఇటీవలి కాలంలో అనేక కేసుల్లో నిందితులు ఆటోల ద్వారానే తప్పించుకుంటున్నారని గుర్తించిన పోలీసులు, ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా విజయవాడ నగరంలో తిరుగుతున్న ప్రతి ఆటోకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక డేటాబేస్లో భద్రపరచాలని పోలీసులు నిర్ణయించారు. దీనికోసం ఏఐ ఆధారంగా పనిచేసే ప్రత్యేక యాప్ను అభివృద్ధి చేశారు.
పూర్తి వివరాలతో క్షణాల్లో..
ఈ యాప్ ద్వారా ఆటోలకు సంబంధించిన నాలుగు వైపుల ఫొటోలు, ఆటో ఓనర్ పేరు, డ్రైవర్ ఫొటో, డ్రైవింగ్ లైసెన్సు వివరాలు వంటి సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. ఈ డేటా మొత్తం డేటాబేస్లో సేవ్ చేస్తారు. కేసుల విచారణ సమయంలో అవసరమైన సమాచారాన్ని క్షణాల్లో పొందేలా ఈ యాప్ను రూపొందించారు. ఈ యాప్కు సంబంధించిన లాగిన్, పాస్వర్డ్లను లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు.
ప్రయాణికులకు సమాచారం..
ఈ ప్రాజెక్టులో మరో కీలక అంశంగా క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రతి ఆటోకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ రూపొందిస్తున్నారు. పోలీసులు యాప్ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే, ఆ ఆటోకు సంబంధించిన పూర్తి వివరాలు తక్షణమే స్క్రీన్పై కనిపిస్తాయి. దీంతో వాహనం ఎవరిది, డ్రైవర్ వివరాలు ఏంటి అన్నది వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
అంతేకాదు, ఈ క్యూఆర్ కోడ్ ప్రయాణికులకు కూడా ఉపయోగపడేలా రూపొందించారు. ఆటోలో ప్రయాణించిన వారు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డ్రైవర్కు రేటింగ్ ఇవ్వొచ్చు. డ్రైవర్ ప్రవర్తన, భద్రత, చార్జీల విషయంలో సమస్యలు ఉంటే టెక్స్ట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వవచ్చు.
దశల వారీగా
విజయవాడ నగరంలో సుమారు 20 వేల ఆటోలు తిరుగుతున్నట్లు అంచనా. ప్రస్తుతం వాటన్నింటి వివరాలను దశలవారీగా నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 2 వేలకుపైగా ఆటోల సమాచారం సేకరించి, వాటికి క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను సిద్ధం చేశారు. ఈ స్టిక్కర్లను ఆటోలపై తప్పనిసరిగా అతికించనున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే రేటింగ్లు, ఫీడ్బ్యాక్ను ఏఐ వ్యవస్థ విశ్లేషించి నివేదికగా రూపొందిస్తుంది. ఈ నివేదికలను సంబంధిత లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు పంపిస్తారు. డ్రైవర్ ప్రవర్తన సరిగా లేదని తేలితే, అతడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి హెచ్చరికలు జారీ చేస్తారు. అవసరమైతే ఆ డ్రైవర్పై నిఘా పెంచే చర్యలు కూడా తీసుకుంటారు.
ఈ కొత్త వ్యవస్థతో ఒకవైపు నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, మరోవైపు ప్రయాణికుల భద్రత మరింత మెరుగవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఆటోలు కూడా ఇకపై నేరస్తులకు ఆశ్రయంగా మారకుండా, పోలీసుల నిఘాలో ఉండేలా ఈ ఏఐ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications