గుట్టపై వ్యభిచారం: అదుపులో 11 జంటలు, అభివృద్ధికి భూసేకరణకు కమిటీ
హైదరాబాద్: ఇటీవల కాలంలో యాదగిరిగుట్టపై వ్యభిచారం జోరుగా జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నల్గొండ జిల్లా పోలీసులు శుక్రవారం పలు లాడ్జిలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పదకొండు జంటలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించారు. స్టేషన్లో వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకోబోమని ఈ సందర్భంగా పట్టుబడిన జంటలను హెచ్చరించారు.
గుట్ట అభివృద్ధి భూసేకరణకు కమిటీ
యాదగిరి గుట్ట అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట అభివృద్ధి భూసేకరణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నల్గొండ జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. కమిటీ సభ్యులుగా స్థానిక ఆర్డీవో, తహసీల్దార్ ఉన్నారు. యాదగిరిగుట్టను మరో తిరుమలగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామి ఇచ్చిన విషయం తెలిసిందే.