సిద్దాంతాలు, విధానాలు లేవా..?: అంతర్వేది ఘటన నిరసనలపై మంత్రి బొత్స ఫైర్..
విపక్షాలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఆందోళన చేసిన వారిని విడుదల చేయాలని రాజకీయ పార్టీలు కోరడం ఏంటీ అని అడిగారు. ప్రార్థనా మందిరాలపై రాళ్లు వేసిన వారిని విడుదల చేయాలని ధర్నాలు చేయడం భావ్యమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సంగతి పట్టించుకోరా.. అని ధ్వజమెత్తారు.
అధికారంలో ఏ పార్టీ ఉన్న రాజకీయ పార్టీలు బాధ్యతగా మసలుకోవాల్సిన అవసరం అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీ అంటే అవాకులు చెవాకులు మాట్లాడానికి, ఇతరులపై బురద చల్లడానికి ఉద్దేశించింది కాదన్నారు. ఓ విధానం ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. చంద్రబాబుకు ఇలాంటి సిద్ధాంతాలు, విధానాలు ఏవీ లేవని మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు అవసరమైతే కాళ్లు.. తీరాక తిట్టిస్తారని బొత్స విమర్శించారు. మతానికి, దేవుడికి, రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఇదొ దుష్ట సంప్రదాయం కొనసాగుతోందని తెలిపారు. అయితే రాజకీయ పార్టీగా నిరసన తెలియజేసే హక్కు ఉంటుందని.. దానిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరామని బొత్స స్పష్టంచేశారు. అంతర్వేదిలో రథం కాలిపోయిందా, లేదంటే కాల్చారా అనే విషయం సీబీఐ విచారణలో తేలుతుందని బొత్స స్పష్టం చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications