గాంధీలో ఎబోలా?: హైదరాబాద్ టెక్కీకి అనుమానిత వైరస్??
హైదరాబాద్: శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి అనుమానిత వైరస్తో మహాత్మా గాంధీ ఆసుపత్రిలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా నైజీరియాలో పని చేసిన ఆయన ఇటీవలె హైదరాబాద్ వచ్చారు. ఇంట్లో ఉండగా తీవ్ర జ్వరం రావడంతో నగరంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో గత నెల 24వ తేదీన చేరారు.
అక్కడ రెండు రోజులు చికిత్స తీసుకున్నప్పటికీ నయం కాలేదు. దీంతో ఆయనకు స్వైన్ ఫ్లూ లేదా ఎబోలా లక్షణాలు ఉండవచ్చునని భావించి, అక్కడి నుండి గాంధీ ఆసుపత్రికి తరలించారు. రోగి రక్త నమూనాలను ఢిల్లీకి పంపించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఎబోలా నోడల్ కేంద్రం వైద్యులు రోగి రక్తనమూనాలను, ముక్కు స్రావాలను సేకరించి ఢిల్లీలోని వైరాలజీ ల్యాబ్కు పంపించారు. బాధితుడు 40 ఏళ్ల వ్యక్తి. నైజీరియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతను నవంబర్ 21న నైజీరియా నుంచి ముంబైకి వచ్చాడు.
అక్కడ నుంచి హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీకి చేరుకున్నాక విపరీతంగా జ్వరం, ఆయాసం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో 24వ తేదీన కేర్ ఆస్పత్రిలో చేరారు. అక్కడి నుండి గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో వైద్యులు అతణ్ని అడ్మిట్ చేసుకుని చికిత్స ప్రారంభించారు. అతడికి ఎబోలా సోకిందనే విషయాన్ని మాత్రం ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications