ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీలు, 500 యూనిట్లు దాటితే 90 పైసల మోత, రాష్ట్రానికి రూ.1300 కోట్లు
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీలు భారీగా పెరిగాయి. 500 యూనిట్లు దాటినా వారికి కరెంట్ చార్జీలను పెంచుతున్నట్టు ఈఆర్సీ ప్రకటించింది. రాష్ట్రంలో డిస్కంలు నష్టాల్లో కొనసాగుతోన్నాయి. విద్యుత్ చార్జీలు పెంచి నష్టాలను పుడ్చలేని ఒత్తిడి వస్తోన్న నేపథ్యంలో 500 యూనిట్లు వినియోగం దాటినా వారికి చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

500 లోపు నో..
విద్యుత్ చార్జీల పెంపుతో సామాన్యులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు. 500 యూనిట్లు దాటినా వారి నుంచి మాత్రం చార్జీ వసూల్ చేస్తారు. 500, ఆపై యూనిట్కు 90 పైసల చొప్పున ముక్కు పిండీ మరీ తీసుకుంటారు. 500 యూనిట్ల తర్వాత యూనిట్కు ఉన్న 9.05 రూపాయలను రూ.9.95కు పెంచారు. యూనిట్కు 90 పైసలు పెంచి.. ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలకు షాక్ ఇచ్చారు.

వీరికే నష్టం..
విద్యుత్ చార్జీల పెంపుతో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, పరిశ్రమలు, కార్యాలయాల బిల్లు మోత మోగనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి 1300 కోట్ల ఆదాయం సమకూరనుంది. దీంతో డిస్కంల నష్టాలను కొంతమేర అయినా భర్తీ చేయొచ్చని ఈఆర్సీ భావిస్తోంది. నష్టాల బాటలో ఉన్న డిస్కంలను బయటపడేసేందుకు చార్జీల పెంపు తప్ప మరో మార్గం లేదని ఈఆర్సీ స్పష్టంచేసింది.

పవర్ ఇవ్వం..
సబ్సిడీదారులకు సంబంధించి బిల్లు వెనక సబ్సిడీ వివరాలు పొందుపరుస్తామని ఏపీ ఈఆర్సీ చైర్మన్ నాగార్జున రెడ్డి తెలిపారు. దీంతోపాటు రైల్వే ట్రాక్షన్ టారిఫ్ పెంచడం వల్ల రూ. 200 కోట్ల బారం పడుతోందని వివరించారు. ఏపీలో 9,500 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉందని నాగార్జున రెడ్డి అన్నారు. విద్యుత్ ఇవ్వాలని ప్రైవేట్ సంస్థలు కోరినా నిరాకరించామని చెప్పారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications