ప్రేయసి గర్భం దాల్చడంతో చంపి పూడ్చి పెట్టిన ప్రియుడు !
ఏలూరు :పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని నడిపూడి వద్ద గోదావరి లంకలో ఇసుకలో పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాం ఆచూకీని పోలీసులు గుర్తించారు.ప్రియుడే ఆమెను చంపి హాత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
రెండు రోజుల క్రితం పెనుగొండ మండలంలోని నడిపూడి వద్ద గోదావరి లంకలో ఇసుకలో పూడ్చిపెట్టిన శవాన్ని కుక్కలు పిక్కుతింటుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఈ సమాచారం ఆదారంగా పోలీసులు ఇసుకలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని సోమవారం నాడు వెలికి తీసి పోస్టుమార్టమ్ నిర్వహించారు.
మృతదేహం వద్దే పూడ్చిపెట్టిన సెల్ పోణ్ , ఫోటోలు పోలీసులకు కీలకమైన ఆధారాలను అందించాయి.పెనుమంట్ర మండలం ఎస్ .ఇంద్రపర్రు గ్రామానికి చెందిన జోగి సీతగా మృతురాలిని పోలీసులు గుర్తించారు..సీతకు సుమారు 20 ఏళ్ళుంటాయి. ఐదేళ్ళ క్రితం తండ్రి కన్నయ్య చనిపోయాడు.సోదరుడు ఉపాధి కోసం ఏడాది క్రితం దుబాయి వెళ్ళాడు.తల్లి లక్ష్మితో కలిసి ఉండేది సీత. తణుకులోని ఓ ఫ్యాక్టరీలో ఆమె పనిచేసేది.
ఐదు మాసాల నుండి ఆమె పనిమాని ఇ:టి వద్దే ఉంటుంది. అక్టోబర్ 22వ, తేది నుండి ఆమె ఆచూకీ కన్పించడంలేదు. ఆమె సమాచారం కోసం ప్రయత్నించినా పలితం లేకపోయింది.సీత గర్భవతి అనే విషయం తల్లికి తెలియదు.సీత మరణానికి సంబందించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.గర్భవతిని చేసిన ప్రియుడే ఆమెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.