ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజనకు బీజం పడింది. మున్సిపల్ కార్పొరేషన్లు మొదలుకుని వార్డుల వరకు పునర్విభజన చోటు చేసుకోనుంది. వాటి రూపం సమూలంగా మారిపోనుంది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డులు 23 నుంచి 52కు పెరుగుతాయి. కార్పొరేషన్లలో 60 నుంచి 120 వరకు డివిజన్లు ఉంటాయి. చివరి జనాభా లెక్కల ప్రాతిపదికన వార్డుల విభజన ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం జనాభా ప్రాతిపదికన డివిజన్ల సంఖ్యను నిర్ణయించారు. రెండు లక్షలలోపు జనాభా ఉంటే ఇకపై 60 మంది వార్డు సభ్యులు ఉంటారు. రెండులక్షల నుంచి మూడు లక్షల వరకు జనాభా ఉంటే 62 మంది, జనసంఖ్య 10 లక్షల వరకు ఉంటే 66 నుంచి 76 వరకు సభ్యులు ఉంటారు. 15 లక్షలు అంత కంటే ఎక్కువ జనాభా ఉన్న పెద్ద కార్పొరేషన్లకు గరిష్ఠంగా 120 మంది సభ్యులు ప్రాతినిథ్యాన్ని వహిస్తారు.

దీని ప్రకారం చూస్తే ఒక మున్సిపాలిటీలో రెండున్నర లక్షల జనాభా ఉందనుకుంటే వాటి సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 50 వార్డులకు అదనంగా మరో 12 చేరుతాయి. అంటే మొత్తం వార్డుల సంఖ్య 62కు పెరుగుతుంది. లక్షకుపైగా జనాభా ఉండే మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న 37వార్డుల సంఖ్య 48కి పెరుగుతాయి. లక్ష వరకు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 36 వార్డులు 48 కి చేరుతాయి.
ఈ నిబంధనలు అమలులో ప్రభుత్వం కొన్ని షరతులను సైతం విధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేని, లోటు బడ్జెట్ లో ఉన్న స్థానిక సంస్థలు తమ నిధులను 16వ ఆర్థిక సంఘం నుండి తీసుకోవచ్చు. లేదా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో పాటు ఇతర పరిపాలనా ఖర్చులకు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లించకూడదు. అలాగే ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికైన ప్రతినిధుల గౌరవ వేతనాలను కూడా పెంచకూడదు.
కాగా- ఆరు నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అదే సమయంలో ఈ పునర్విభజన వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎన్నికలతో పాటు సమాంతరంగా పునర్విభజన ప్రక్రియను అధికారులు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని వార్డుల సంఖ్య పెంచాలని నిర్ణయించినట్లు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. దీనికి సంబంధించిన సర్వే మొదలైందని, అది పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్తామని అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications