వద్దన్నా వినలేదు-సింహాచలం ఘటనపై నోరు విప్పిన కాంట్రాక్టర్..!
ఏపీలో సింహాచలం ఆలయ గోడ కూలిన ఘటనలో 8 మంది భక్తులు చనిపోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. అయితే విచారణలో ఈ గోడ నిర్మించిన కాంట్రాక్టర్ ఇవాళ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అధికారుల కమిటీ అడిగిన ప్రశ్నలకు కాంట్రాక్టర్ ఇచ్చిన సమాధానాలు చూస్తే ఈ గోడ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆర్ధమవుతోంది.
సింహాచలం గోడ కూలిపోయిన సంఘటనలో పాలనా పరమైన నిర్లక్ష్యం, అధికారుల ఒత్తిడి ఉన్నట్లు కాంట్రాక్టర్ లక్షణరావు ఇాళ వెల్లడించాడు. చందనోత్సవానికి ముందు చాలా తక్కువ సమయం మాత్రమే ఉందని తాను చెప్పానని, నిర్మాణాన్ని చేపట్టడానికి ముందు నిరాకరించానని వెల్లడించాడు. తక్కువ సమయం మిగిలి ఉందని, కేవలం ఆరు రోజుల్లో గోడ నిర్మించడం సాధ్యం కాదని అధికారులకు స్పష్టంగా చెప్పానన్నారు.

అయితే తన అభ్యంతరాలను దేవస్థానం, పర్యాటక శాఖ అధికారులు పట్టించుకోలేదని, నిర్మాణంపై ముందుకు సాగాలని పట్టుబట్టారని వెల్లడించాడు. వారు గోడ నిర్మించమని తనపై ఒత్తిడి తెచ్చారని, ఇది తాత్కాలిక నిర్మాణం మాత్రమే అని తనకు చెప్పినట్లు తెలిపాడు. పండుగకు నాలుగు రోజుల ముందు పని ప్రారంభించామని, నిర్మాణ సమయం, నాణ్యతపై ఆందోళన ఉందని వెల్లడించాడు. చివరకు ఈ ఘటన చోటు చేసుకుందని వాపోయాడు.
🚨 #SaveSimhachalamFromTDP
— YSR Congress Party (@YSRCParty) May 1, 2025
కాంట్రాక్టర్ రిస్క్ అని చెప్పినా.. బలవంతంగా సింహాచలం గోడ కట్టించిన కూటమి ప్రభుత్వం
చందనోత్సవానికి సమయం చాలా తక్కువ ఉందని.. నాణ్యమైన గోడ కట్టలేనని మొత్తుకున్న కాంట్రాక్టర్ లక్ష్మణరావు
కానీ.. టెంపరరీ గోడ కడితే చాలని కాంట్రాక్టర్ను మభ్యపెట్టిన… pic.twitter.com/PKJrRbR6Rc
సింహాచలంలో భారీ వర్షం కారణంగా గోడ కూలిన ఘటనలో 8 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. ఈ గోడ నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో వైసీపీ, కూటమి పార్టీల మధ్య మాటల యుద్దం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ ఇలా అసలు విషయం బయటపెట్టడంతో ప్రభుత్వం ఇరుకునపడింది.
-
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
ఉగాది కానుకగా "జాబ్ క్యాలెండర్" రిలీజ్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..? -
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..? -
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-వారికి డబ్బులు రిఫండ్..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications