వ్యభిచార గృహంపై దాడి: కిటికీ నుంచి స్త్రీతో పాటు పరారీ
రహమత్నగర్లోని నిమ్స్మే ఎదురుగా ఉన్న దుర్గాలమ్మ రెసిడెన్సీ మొదటి అంతస్తులో ఉన్న ఫ్లాట్నెంబర్ 106 గత కొంత కాలంగా వ్యభిచారం నడుస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపధ్యంలో ఆదివారం 4:30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ కానిస్టేబుల్ కొండల్రెడ్డి, వెస్ట్జోన్ అడిషనల్ డిసిపి గన్మెన్ ఆంజనేయులు వ్యభిచార గృహంపై దాడి చేశారు.
తలుపుకొట్టగా లోపలి నుండి వ్యభిచార గృహనిర్వాహకులు తలుపు తీసి ఎదురుగా ఉన్న పోలీసులను గమనించారు. వారు లోపలికి ప్రవేశిస్తుండగానే కొండల్రెడ్డిని కత్తితో మూడు పోట్లు పొడిచారు. అడ్డుకోబోయిన ఆంజనేయులుపై కూడా కత్తితో దాడి చేశారు. తీవ్రంగా రక్తం కారుతుండగా కిందకు పరుగులు తీసి సమీపంలో ఉన్న ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు.
పోలీసులు అటు వెళ్లగానే వ్యభిచార గృహ నిర్వాహకుడితో పాటు ఒక మహిళ కూడా కిటికిలో నుండి దూకి పరారయ్యారు. సంఘటన గురించి తెలుసుకున్న డిసిపి సత్యనారాయణ, అడిషనల్ డిసిపి నాగరాజు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ప్రదీప్కుమార్ రెడ్డి అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరించారు.
పరారైన నిందితుల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల అనుమతితోనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఇక్కడికి వచ్చారని తెలిపారు. దాడిలో గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.