ముంబై మోడల్స్తో వ్యభిచారం: పోలీసుల అదుపులో హాస్యనటుడి బంధువు
విజయవాడ: ముంబై మోడళ్లతో నిర్వహిస్తున్న వ్యభిచారం గుట్టును విజయవాడ టాస్క్పోర్స్ పోలీసులు రట్టు చేశారు. సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం ముసుగులో వ్యభిచారం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఓ హాస్యనటుని బంధువును కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిజంగానే అతను హాస్యనటుడి బంధువా, ఆయన పేరు వాడుకుంటున్నారా అనేది తేలాల్సి ఉంది.
అయితే తాను వ్యభిచారం నిర్వహించడం లేదని, తాను విటుడ్ని మాత్రమేనని హాస్య నటుడి బంధువు వాదిస్తున్నట్లు సమాచారమంటూ శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి. కృష్ణా జిల్లా నున్న రారల్ పోలీసు స్టేషన్ పరిధిలోని శాంతినగర్లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
ముంబై, చెన్నై తదితర ప్రాంతాల నుంచి మోడళ్లను రప్పించి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందంటూ మీడియాలో శనివారంనాడు వార్తలు వచ్చాయి. దాంతో పోలీసులు గత కొద్ది రోజులుగా ఆ ఇంటిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం ముంబైకి చెందిన ఓ మోడల్ను కాంట్రాక్టు పద్ధతిపై తీసుకుని వచ్చినట్లు తెలిసింది.
పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ ఎసిపి పివిఆర్పివి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ జి. శ్రీనివాస్, సిబ్బంది గురువారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి ఇద్దరు యువతులతో పాటు రాజమండ్రికి చెందిన రాజేష్ను, నగరంలో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తున్న మొయినుద్దీన్ మహ్మద్ను అదుపులోకి తీసుకుని రూరల్ పోలీసులకు అప్పగించారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ యువతి తాను ముంబైలో మోడలింగ్ చేస్తుంటానని చెప్పిది. రోజుకు రూ.10 వేల చొప్పున కాంట్రాక్టుతో పాటు విమానం చార్జీలు, బస ఏర్పాటు చేయడంతో ఇక్కడికి వచ్చినట్లు చెప్పిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.