రాజకీయాలే వద్దనుకున్నా, కానీ భర్త...: పురందేశ్వరి
హైదరాబాద్: తాను రాజకీయాల నుంచే తప్పుకుందామని అనుకున్నానని, అయితే తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, మిత్రులు, శ్రేయోభిలాషులు చెప్పడంతో కొనసాగాలని అనుకున్నానని మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. బిజెపిలో చేరిన తర్వాత ఆమె శుక్రవారం సాయంత్రం ఎం. వెంకయ్యనాయుడితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల రాజకీయాల్లోకి వచ్చావు, ఇప్పుడే తప్పుకోవడం ఎందుకని దగ్గుబాటి వెంకటేశ్వర రావు, కుటుంబసభ్యులు మిత్రులు, శ్రేయోభిలాషులు చెప్పారని ఆమె అన్నారు. రాజకీయాల్లో కొనసాగాలని పట్టుబట్టారని ఆమె చెప్పారు.
కాంగ్రెసుకు రాజీనామా చేసిన తర్వాత ప్రత్యామ్నాయం గురించి ఆలోచించినప్పుడు జాతీయ పార్టీలో ఉంటే తన ప్రజలకు న్యాయం చేయగలుగుతానని అనిపించిందని, అందుకే బిజెపిని ఎన్నుకున్నానని ఆమె చెప్పారు. విభజన విషయంలో తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉందామని అనుకున్నానని, అయితే సీమాంధ్రకు న్యాయం చేయాలని కోరామని, అది కూడా చేయలేదని ఆమె అన్నారు. లోకసభలో ప్రవేశపెట్టిన బిల్లులో సీమాంధ్రకు ప్ర్తత్యేక హోదా గానీ పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చడం గానీ లేవని, అప్పుడే తాను తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించానని ఆమె వివరించారు.

ఎంతో బాధతో తాను రాజీనామా లేఖ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. బిజెపి నేతలు తనను బాగా ఆదరించారని ఆమె చెప్పారు. తన తండ్రి ఎన్టీ రామారావు వల్ల కావచ్చు, తన పనితీరును చూసి కావచ్చు వారు తనను ఆదరించారని పురంధేశ్వరి చెప్పారు. తాను బేషరతుగా బిజెపిలో చేరినట్లు ఆమె తెలిపారు. పార్టీ దిశానిర్దేశానికి అనుగుణంగా నడుచుకుంటానని ఆమె చెప్పారు. బిజెపిలో చేరి సీమాంధ్రకు న్యాయం చేయగలనని అనుకుంటున్నట్లు తెలిపారు.
వెనక్కి తిరిగి చూసుకోవడం విలువైన సమయాన్ని వృధా చేయడమేనని వెంకయ్య నాయుడు అన్నారు. తాము పట్టుబట్టిన తర్వాతనే సీమాంధ్రకు ఆ మాత్రం రాయితీలైనా ఇచ్చారని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చగలిగే విశ్వసనీయత, సమర్థత నరేంద్ర మోడీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications