టీడీపీలో చేరేందుకు సిద్ధమే, కానీ టైం..: పురంధేశ్వరి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కేంద్ర మాజీ మంత్రి, దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావులు సిద్ధమేనని ప్రకటించారు! అయితే, సమయం అనుకూలించాలని చెప్పారు. వారు ఆమెరికా పర్యటనలో ఉన్నారు. శనివారం లాస్ ఏంజిల్స్లో శనివారం ప్రవాసాంధ్రులతో నిర్వహించిన సమావేశంలో కలిసి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్నా, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకున్నా ప్రస్తుత తరుణం మంచిదని పురంధేశ్వరి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్థవంతంగా పాలన చేస్తోందని, అగ్రరాజ్యాల సరసన భారత్ను నిలబెట్టేలా కృషి చేస్తోందన్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... గత పదేళ్లుగా కాంగ్రెసు పార్టీలో ఉన్న మీరు ఇప్పుడు బీజేపీలోకి వచ్చారన,ి టీడీపీలోకి ఎప్పుడు వస్తారని ప్రశ్నించారు. దానిపై ఆమె స్పందించారు. తాము కూడా దీనికి సానుకూలంగానే ఉన్నామని, పరిణామాలు ఇందుకు అనుకూలించాలని వారు పేర్కొన్నారు.