విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చీపురు పట్టి, పవన్ కళ్యాణ్‌కు సింధు సవాల్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా చీపురు పట్టిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, లియాండర్ పేస్, గుత్తా జ్వాలలను నామినేట్ చేశారు. శనివారం స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా తొలుత ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది మంది పేర్లను ప్రస్తావించారు.

ఆ జాబితాలోని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్వచ్ఛ భారత్‌లో పాల్గొని తానూ తొమ్మిది మందిని ప్రకటించారు. ఆ పేర్లలో పీవీ సింధూ ఒకరు. సానియా మీర్జా ఆహ్వానాన్ని మన్నించిన పీవీ సింధూ శనివారం స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై ముగ్గురు ప్రముఖుల పేర్లకు సవాల్ చేశారు.

కాగా, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు శనివారం నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సింధు హాజరై రోడ్డును శుభ్రం చేశారు. ఆ తర్వాత మొక్కలు నాటారు. మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, హీరో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇంతకు ముందే పాల్గొన్నారు.

పీవీ సింధు

పీవీ సింధు

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు శనివారం నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింధు హాజరై రోడ్డును శుభ్రం చేశారు.

పీవీ సింధు

పీవీ సింధు

స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా చీపురు పట్టిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, లియాండర్ పేస్, గుత్తా జ్వాలలను నామినేట్ చేశారు.

పీవీ సింధు

పీవీ సింధు

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్వచ్ఛ భారత్‌లో పాల్గొని తానూ తొమ్మిది మందిని ప్రకటించారు. ఆ పేర్లలో పీవీ సింధూ ఒకరు. సానియా మీర్జా ఆహ్వానాన్ని మన్నించిన పీవీ సింధూ శనివారం స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నారు.

పీవీ సింధు

పీవీ సింధు

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్వచ్ఛ భారత్‌లో పాల్గొని తానూ తొమ్మిది మందిని ప్రకటించారు. ఆ పేర్లలో పీవీ సింధూ ఒకరు. సానియా మీర్జా ఆహ్వానాన్ని మన్నించిన పీవీ సింధూ శనివారం స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై ముగ్గురు ప్రముఖుల పేర్లకు సవాల్ చేశారు.

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

స్వచ్ఛ భారత్‌లో పీవీ సింధూ అనంతరం ముగ్గుర్ని నామినేటే చేశారు. అందులో పవన్ కళ్యాణ్, లియాండర్ పేస్, గుత్తా జ్వాలాలు ఉన్నారు.

English summary
PV Singhu Swachh Bharat Challenge to Pawan Kalyan and Gutta Jwala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X