వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు ఝలక్: బిజెపిలో చేరిన రఘురామ రాజు

By Pratap
|
Google Oneindia TeluguNews

Raghurama Krishnam Raju
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో తెగదెంపులు చేసుకున్న రఘురామకృష్ణరాజు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఉదయం బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో రఘురామకృష్ణ రాజు పార్టీలో చేరారు.

ఆయనతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌వర్మ ఉన్నారు. తమ పార్టీలో చేరడానికి నాయకులు బారులు తీరుతున్నారని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనలో సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూస్తామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని ఆయన అన్నారు.

సీమాంధ్రకు న్యాయం చేయడానికి అవసరమైన సవరణల కోసం తాము ఒత్తిడి చేస్తామని, యుపిఎ ప్రభుత్వం న్యాయం చేయకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందని ఆయన చెప్పారు.

రాష్ట్ర విభజన పూర్తయ్యే వరకు ఏ పార్టీతోనూ తాము పొత్తు కసరత్తు చేయబోమని ఆయన అన్నారు. తెలంగాణపై తమ వైఖరిలో మార్పు రాలేదని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లులో తాము ప్రతిపాదించే సవరణలకు ప్రభుత్వం అంగీకరిస్తుందని తాము ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

English summary
Resigning for YS Jagan's YSR Congress party Raghurama Krishnam Raju joined BJP in the presence of Rajnath Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X