వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ టూర్ కు వెళ్దామనుకున్నా-కానీ అది చూసి ఆశ్చర్యపోయా-రఘురామ షాకైన వేళ..

|
Google Oneindia TeluguNews

ప్రధాని మోడీ భీమవరం టూర్ ఇవాళ పలు సంచలనాలకు కారణమైంది. ఈ టూర్ కు విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో ఈ టూర్ లో పాల్గొనాల్సిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు జగన్ సర్కార్ చివరి నిమిషంలో షాకిచ్చింది. హైదరాబాద్ నుంచి బయలుదేరి భీమవరం వెళ్లేందుకు సిద్దమవుతున్న రఘురామరాజుకు అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు.

ప్రధాని మోడీ భీమవరం టూర్ లో పాల్గొనేందుకు ఆహ్వానించిన అతిధుల జాబితాలో వైసీపీ రెబెల్ ఎఁపీ రఘురామకృష్ణంరాజు పేరు లేదు. దీంతో ఆయన ఈ టూర్ కు వెళ్లేందుకు అనుమతి లభించలేదు. చివరికి విషయం తెలిసి ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోయారు. దీనిపై ఆయన స్పందించారు. ప్రధాని వస్తున్నారని కార్యక్రమానికి హాజరవుదామనుకున్నానని, అయితే తనను సభకు వెళ్లకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

raghurama krishnam raju surprised after his name removed from pm modi tour protocol list

కొన్ని విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలాగే ఉంటాయని రఘురామ వ్యాఖ్యానించారు. విషనాగులే పాలకులవుతారని, ఆనాడు అంబేద్కర్ అనుకోలేదని రఘురామ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులుంటాయని తెలిస్తే రాజ్యాంగాన్ని మరోలా రాసేవారని తెలిపారు. ఇలాంటి నాయకులు ఏపీని పాలిస్తుండడం దురదృష్టకరమన్నారు.

ప్రధాని మోడీ భీమవరం టూర్ లిస్ట్ లో తన పేరు లేదని తెలిసి ఆశ్చర్యపోయానని రఘురామరాజు చెప్పారు. ముందే ప్రొటోకాల్ సమస్యలపై కేంద్రానికి లేఖ రాశానని, అయినా తన పేరును లిస్టులో ఎందుకు చేర్చలేదో అర్థం కావట్లేదన్నారు. కోర్టులు ఆదేశించినా పట్టించుకోకపోతే ఏమనాలి? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

English summary
ysrcp rebel mp raghurama krishnam raju has surprised on his name removal from pm modi's bhimavaram tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X