గుండెలో స్ట్రా వేసి రక్తం తాగడమే: కాల్మనీ బిజినెస్పై రఘువీరా
అనంతపురం: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాన్ని సృష్టించిన కాల్ మనీ వ్యవహారంపై ఆంధ్రప్రదేస్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి శుక్రవారం ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిక వడ్డీలకు అప్పులిచ్చి వడ్డీతో సహా అసలు వసూలు చేసుకునేందుకు కాల్ మనీ వ్యాపారులు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా అనంతపురం జిల్లాలో రఘవీరా రెడ్డి అనుచరుడు సాయి ప్రసాద్ మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రఘవీరా శుక్రవారం ఉదయం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కాల్ మనీ వ్యాపారులు వందకు 12 రూపాయల వడ్డీని తీసుకుంటున్నారంటే గుండెలో స్ట్రా వేసి రక్తం తాగడమేనని ఆయన అన్నారు. ప్రజల రక్తం తాగుతున్న కాల్మనీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాల్మనీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
ఆత్మహత్య చేసుకుంటున్నా: ఎస్పీకి వాట్సప్లో మెసేజ్
ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఎస్పీకి వాట్సప్లో మేసేజ్ పెట్టిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అనంతపురం పట్టణంలో బీరే మెహన్ అనే వ్యక్తి పట్టుచీరల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో అతను వ్యాపారంలో నష్టాల రావడంతో అప్పుల పాలయ్యాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్ జిల్లా ఎస్పీకి వాట్సప్ ద్వారా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మెసేజ్ చేశాడు. దీంతో కంగుతిన్న ఎస్పీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశాడు. హుటాహుటిన కదిలిన పోలీసులు.. మోహన్ ను కలుసుకొని ఆత్మహత్యకు పాల్పడొద్దంటూ కౌన్సిలింగ్ ఇచ్చారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications