జగన్ అధికారంలోకి వస్తారని భావించాం: రఘువీరా, టీడీపీతో పొత్తుపై..
అనంతపురం: గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని భావించామని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి సోమవారం అన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని చెప్పారు.
2014లో వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించామని, కానీ చివరి నిమిషంలో ఫలితాలు తారుమారు అయ్యాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని జోస్యం చెప్పారు. తెలుగుదేశం, బీజేపీ వైఫల్యాలపై కరపత్రాలతో ఇంటింటికి ప్రచారం చేస్తామని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరితోను పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటవుతున్నాయనే ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే.

దీనిపై రఘువీరా స్పందించారు. ఏ పార్టీతోను వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండదన్నారు. పొత్తులపై పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీదే తుది నిర్ణయం అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎవరితోనైనా కలిసి పని చేస్తామని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేక శక్తులతో తాము పని చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications