రైలు ప్రమాదం: నిలకడగా 8 మంది విద్యార్థుల ఆరోగ్యం
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల్లో ఎనిమిది మంది ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. శనివారం ఉదయం యశోదా ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయిరాం, రుతిక, సాత్విక, హరీష్, మహిపాల్ రెడ్డి, సద్భావన్, దర్శన్, శివకుమార్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
ఆ ఎనిమిది విద్యార్థులను సాయంత్రం వార్డుకి తరలిస్తామని వైద్యులు చెప్పారు. మరో ఐదుగురి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ అబ్జర్వేషన్లో పెట్టినట్లు వారు తెలిపారు. శరత్, శ్రావణి, శిరీషల ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెప్పారు. తరుణ్, వైష్ణవి, వరుణ్, ప్రశాంత్ల ఆరోగ్యం కాస్తా ఆందోళనకరంగా ఉందని చెప్పారు.

ఇదిలావుంటే, మెదక్ జిల్లా వెల్తుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై దక్షిణ మధ్య రైల్వే విచారణ ప్రారంభించింది. ముగ్గురు ఉన్నతాధికారులతో విచారణకు దక్షిణ మధ్య రైల్వే కమిటీని వేసింది.
గురవారం ఉదయం కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన పాఠశాల బస్సును నాందేడ్ ప్యాసెంజర్ రైలు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 16 మంది చిన్నారులు మరణించారు. గాయపడిన విద్యార్థులు సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications