రైలు ప్రమాదం: నిలకడగా 8 మంది విద్యార్థుల ఆరోగ్యం
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల్లో ఎనిమిది మంది ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. శనివారం ఉదయం యశోదా ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయిరాం, రుతిక, సాత్విక, హరీష్, మహిపాల్ రెడ్డి, సద్భావన్, దర్శన్, శివకుమార్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
ఆ ఎనిమిది విద్యార్థులను సాయంత్రం వార్డుకి తరలిస్తామని వైద్యులు చెప్పారు. మరో ఐదుగురి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ అబ్జర్వేషన్లో పెట్టినట్లు వారు తెలిపారు. శరత్, శ్రావణి, శిరీషల ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెప్పారు. తరుణ్, వైష్ణవి, వరుణ్, ప్రశాంత్ల ఆరోగ్యం కాస్తా ఆందోళనకరంగా ఉందని చెప్పారు.

ఇదిలావుంటే, మెదక్ జిల్లా వెల్తుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై దక్షిణ మధ్య రైల్వే విచారణ ప్రారంభించింది. ముగ్గురు ఉన్నతాధికారులతో విచారణకు దక్షిణ మధ్య రైల్వే కమిటీని వేసింది.
గురవారం ఉదయం కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన పాఠశాల బస్సును నాందేడ్ ప్యాసెంజర్ రైలు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 16 మంది చిన్నారులు మరణించారు. గాయపడిన విద్యార్థులు సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications