రైల్వే మంత్రి పీయూష్ గోయల్...ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు
తిరుపతి:రైల్వే మంత్రి పియూష్ గోయల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఈమేరకు ఆయన పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. ప్రధానంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎపికి వస్తున్న కేంద్ర మంత్రి మరి కొన్ని అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.
రైల్యే మంత్రి పీయూష్ గోయల్ ఎపి పర్యటర షెడ్యూల్ వివరాలు ఇవి...ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న ఆయన గురువారం ఉదయం 11.30 గంటలకు చెన్నై చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 8.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వస్తారు.

రోడ్డు మార్గంలో రాత్రి 9.30 గంటలకు తిరుమలకు చేరుకుని బస చేస్తారు. 15వ తేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకోనున్నారు. అక్కడి నుంచి బయలు దేరి ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. రైల్వేస్టేషన్ తనిఖీ అనంతరం వీఐపీ లాంజ్లో ఉదయం 9.45 గంటల వరకు తిరుపతి స్మార్ట్ రైల్వేస్టేషన్, తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులతో పాటు, గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరపనున్నారు. ఈ క్రమంలో ఆయన తిరుపతి రైల్వేస్టేషన్ను తనిఖీ చేసే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications