Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శాతవాహన, గోల్కొండ, గౌతమి ప్రయాణీకులకు బిగ్ అప్డేట్ - కీలక మార్పులు..!!

రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు రైల్వే యార్డ్‌ రీమోడలింగ్‌ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. అదే సమయంలో మరి కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేయగా.. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఇక.. వేసవి రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. రైళ్ల షెడ్యూల్ ను ప్రకటించారు.

విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు రైల్వే యార్డ్‌ రీమోడలింగ్‌ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్ల పైన అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మరో 10 రైళ్లను దారిమళ్లించడంతో పాటు 2 రైళ్లను రీషెడ్యూల్‌ చేసినట్లు వివరించారు. రద్దు.. మార్పులు చేసిన వాటిల్లో సికింద్రాబాద్‌-విజయవాడ- (శాతవాహన), గుంటూరు-సికింద్రాబాద్‌ (గోల్కొండ), విజయవాడ- భద్రాచలం (మెమో), విజయవాడ-డోర్నకల్‌ (మోమో), విశాఖపట్నం-మహబూబ్‌నగర్‌ (విశాఖ), కాకినాడ-లింగంపల్లి (గౌతమి), సంబల్‌పూర్‌-నాందేడ్‌ (నాగావళి), నాందేడ్‌-విశాఖపట్నం- సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయని తెలిపారు. కాగా, వేసవి రద్దీకి అనుగుణంగా రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

railway-officials-announces-that-20-trains-partially-cancel-between-duvvada-vijayawada-due-to-tech
చర్లపల్లి-తిరుచానూరు, తిరుపతి-అకోలా, కాచిగూడ-తిరుచానూరు, తిరుపతి- చర్లపల్లి, నాందేడ్-తిరుచానూరు, చర్లపల్లి-తిరుచానూరు, సికింద్రాబాద్-అనకాపల్లి, తిరుపతి-నరసా పూర్, నాందేడ్-ధర్మవరం, చర్లపల్లి-నరసాపూర్, కాకినాడ టౌన్- లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-కాకినాడ టౌన్, జల్నా-తిరుచానూర్, చర్లపల్లి-అనకాపల్లి, సికింద్ రాబాద్-అనకాపల్లి, కాకినాడ టౌన్- మైసూర్, చర్లపల్లి- భువనేశ్వర్ న్యూ, తిరుపతి-పందార్‌పూర్, హైదరాబాద్-బెళగావి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. అదే విధంగా కొన్ని రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
చర్లపల్లి-తిరుచానూరు, తిరుపతి-అకోలా, కాచిగూడ-తిరుచానూరు, తిరుపతి- చర్లపల్లి, నాందేడ్-తిరుచానూరు, చర్లపల్లి-తిరుచానూరు, సికింద్రాబాద్-అనకాపల్లి, తిరుపతి-నరసా పూర్, నాందేడ్-ధర్మవరం, చర్లపల్లి-నరసాపూర్, కాకినాడ టౌన్- లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-కాకినాడ టౌన్, జల్నా-తిరుచానూర్, చర్లపల్లి-అనకాపల్లి, సికింద్ రాబాద్-అనకాపల్లి, కాకినాడ టౌన్- మైసూర్, చర్లపల్లి- భువనేశ్వర్ న్యూ, తిరుపతి-పందార్‌పూర్, హైదరాబాద్-బెళగావి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. అదే విధంగా కొన్ని రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
గ్యాస్ కష్టాల వేళ వారికి 5 కేజీల సిలిండర్లు, కిరోసిన్ పంపిణీ - కీలక ఆదేశాలు..!!
గ్యాస్ కష్టాల వేళ వారికి 5 కేజీల సిలిండర్లు, కిరోసిన్ పంపిణీ - కీలక ఆదేశాలు..!!

వేసవికి ప్రత్యేక రైళ్లు... సర్వీసులు పొడిగింపు

రైలు నెం: 06557 (ఎస్ఎంవీటీ బెంగళూరు- సంత్రాగాచి.. ఏప్రిల్ 10 నుంచి 24 వరకు శుక్రవారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది. రైలు నెం: 06558 (శాంత్రగాచి- బెంగళూరు కంటోన్మెంట్) ఏప్రిల్ 12 నుంచి 26 వరకు ఆదివారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది. రైలు నెం: 06207 (బెంగళూరు కంటోన్మెంట్- కలబురగి) ఏప్రిల్ 11 నుంచి 25 వరకు శనివారాల్లో (3 సర్వీసులు) నడవనుంది. కాగా.. రైలు నెం: 06208 (కలబురగి- బెంగళూరు కంటోన్మెంట్) ఏప్రిల్12 నుంచి 26 వరకు ఆదివారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది. అదే విధంగా రైలు నెం: 06539 (ఎస్ఎంవీటీ బెంగళూరు-బీదర్) ఏప్రిల్ 10 నుంచి 12 వరకు.. ఏప్రిల్ 17 నుంచి 26 వరకు శుక్ర, ఆదివారాల్లో (6 సర్వీసులు) నడుస్తుంది. ఇక.. రైలు నెం: 06540 (బీదర్- ఎస్‌ఎంవీటి బెంగళూరు) ఏప్రిల్ 11 నుంచి 13 వరకు.. ఏప్రిల్ 16 నుంచి 27 వరకు శనివారాలు, సోమవారాల్లో (6 సర్వీసులు) నడుస్తుందని అధికారులు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+