గూడూరు జంక్షన్ కు రైల్వే శాఖ అదిరిపోయే న్యూస్..!
నెల్లూరు జిల్లాలోని గూడూరు రైల్వే స్టేషన్ కు రైల్వే శాఖ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. చెన్నై మార్గంలో కీలక రైల్వే జంక్షన్ అయిన గూడూరు రైల్వే స్టేషన్ రూపురేఖల్ని మార్చేందుకు వీలుగా భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. ఈ నిధులతో గూడూరు రైల్వే స్టేషన్లో పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. వీటి వివరాలను కూడా రైల్వే శాఖ విడుదల చేసింది. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి.
గూడూరు రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి రూ.49.18 కోట్ల భారీ మంజూరును మంజూరు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రాంతంలో ప్రయాణికుల భవిష్యత్ వృద్ధికి అనుగుణంగా, ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరిచేలా పలు సౌకర్యాలను ఈ నిధులతో ఏర్పాటు చేయబోతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కీలక స్టేషన్లను ఆధునీకరించే కార్యక్రమంలో భాగంగా గూడూరు స్టేషన్ కు ఈ నిధులు కేటాయించారు.

ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్టేషన్ ను ఆభివృద్ధి చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక మైలురాయి సౌకర్యంగా గూడూరు స్టేషన్ ను అభివృద్ధి చేయబోతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా గూడూరు స్టేషన్లో గ్రౌండ్ + 2 అంతస్తులతో కూడిన కొత్త స్టేషన్ భవనం ఏర్పాటు చేస్తారు.
అలాగే గూడూరు స్టేషన్లో 1 నుండి 5 వరకు ప్లాట్ఫారమ్ల పూర్తి పొడవు కోసం కవర్ ఓవర్ ప్లాట్ఫారమ్ల ఏర్పాటు, తూర్పు నుండి పడమర ప్రవేశ ద్వారం వరకు 12 మీటర్ల వెడల్పు గల రూఫ్ ప్లాజా, స్టేషన్ భవనంతో లింక్ చేయనున్నారు. అలాగే సర్క్యులేటింగ్ ఏరియాలో మార్పులు చేయడం, స్టేషన్ భవనానికి కొత్త ముఖద్వారం ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications