Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాచిగూడ–యశ్వంతపూర్ వందే భారత్ టైమింగ్స్ ఛేంజ్, కొత్త వేళలు ఇలా..!!

రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. కాచిగూడ-యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు చేసారు. ఈ మేరకు కొత్త వేళలను ప్రకటించారు. ఈ రైలు ప్రారంభం నుంచి ఆక్యుపెన్సీ పెరుగుతోంది. దీంతో.. ఈ రైలు కు కోచ్ ల సంఖ్య పెంచటంతో పాటుగా వేగం సైతం పెంచారు. అదే విధంగా రూట్ లో కొత్త హాల్టింగ్స్ పైన నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఇప్పుడు ఈ రైలు వేళల్లో తీసుకొచ్చిన మార్పులు ఈ నెల 15వ తేదీ నుంచి అమలు కానున్నాయి.

యశ్వంత్ పూర్ - కాచిగూడ వందేభారత్ రైలు ప్రారంభం నుంచి ఆదరణ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే వందేభారత్ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్ మేరకు మరిన్ని సేవలను పెంచేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ప్రకటించనున్న వందేభారత్ స్లీపర్ ను సికింద్రాబాద్ - బెంగళూరు, విశాఖ - బెంగళూరు వయా తిరుపతి మీదుగా ప్రకటించే విధంగా కసరత్తు జరుగుతోంది. కాగా.. ప్రస్తుతం నడుస్తున్న యశ్వంత్ పూర్ - కాచిగూడ వందేభారత్ కు పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా కోచ్ ల పెంపుతో పాటుగా హాల్టింగ్ విషయం లోనూ రైల్వే అధికారులు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఇప్పుడు సమయాల్లో మార్పులు చేసారు. కొత్త టైమింగ్స్ మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి. యశ్వంతపూర్ - కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 20704) హిందూపూర్ స్టేషన్‌కు మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుకుని, 3.57 గంటలకు బయలుదేరుతుంది.

ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!!
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!!
railways-key-announcement-over-timings-change-for-kacheguda-yesvantpur-vande-bharat-here-the-full-d

కొత్త వేళలను ప్రకటించిన రైల్వే

ప్రస్తుతం ఈ రైలు 3.48 గంటలకు వచ్చి, 3.50 గంటలకు బయలుదేరుతోంది. అదే విధంగా కాచిగూడ - యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 20703) హిందూపూర్‌కు మధ్యాహ్నం 12.17 గంటలకు చేరుకుని, 12.19 గంటలకు బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ రైలు 12.08 గంటలకు చేరుకుని, 12.10 గంటలకు బయలు దేరేది. కాగా, తాజాగా చేసిన మార్పులు.. కొత్త సమయాలకు అనుగుణంగా ప్రయాణీకులు ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. యశ్వంతపూర్-కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో ఆరు రోజులు మాత్రమే నడుస్తుంది. బుధవారం ఈ రైలు సేవలు ఉండవు. కాగా.. కలబురగి-బెంగళూరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (నం. 22231) రైలు 15వ తేదీ నుంచి శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌కు ఉదయం 11 గంటలకు బదులు 11.13 గంటలకు, యల్హంక స్టేషన్‌కు మధ్యాహ్నం 12.28 గంటలకు బదులు 12.30 గంటలకు చేరుతుందన్నారు. బెంగళూరు-కలబురగి వందే భారత్‌ రైలు (నం. 22232) యల్హంక స్టేషన్‌కు మధ్యాహ్నం 3.05 గంటలకు బదులు 3.09 గంటలకు వస్తుందని, శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 4.23 గంటలకు బదులుగా సాయంత్రం 4.45 గంటలకు వస్తుందని తెలియజేశారు.
ప్రస్తుతం ఈ రైలు 3.48 గంటలకు వచ్చి, 3.50 గంటలకు బయలుదేరుతోంది. అదే విధంగా కాచిగూడ - యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 20703) హిందూపూర్‌కు మధ్యాహ్నం 12.17 గంటలకు చేరుకుని, 12.19 గంటలకు బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ రైలు 12.08 గంటలకు చేరుకుని, 12.10 గంటలకు బయలు దేరేది. కాగా, తాజాగా చేసిన మార్పులు.. కొత్త సమయాలకు అనుగుణంగా ప్రయాణీకులు ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. యశ్వంతపూర్-కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో ఆరు రోజులు మాత్రమే నడుస్తుంది. బుధవారం ఈ రైలు సేవలు ఉండవు. కాగా.. కలబురగి-బెంగళూరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (నం. 22231) రైలు 15వ తేదీ నుంచి శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌కు ఉదయం 11 గంటలకు బదులు 11.13 గంటలకు, యల్హంక స్టేషన్‌కు మధ్యాహ్నం 12.28 గంటలకు బదులు 12.30 గంటలకు చేరుతుందన్నారు. బెంగళూరు-కలబురగి వందే భారత్‌ రైలు (నం. 22232) యల్హంక స్టేషన్‌కు మధ్యాహ్నం 3.05 గంటలకు బదులు 3.09 గంటలకు వస్తుందని, శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 4.23 గంటలకు బదులుగా సాయంత్రం 4.45 గంటలకు వస్తుందని తెలియజేశారు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+