పల్నాడు, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ ప్రెస్ ల ప్రయాణీకులకు బిగ్ అలర్ట్, కీలక మార్పు- ఇక నుంచి..!!
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రయాణీకుల కోసం కొత్త సౌకర్యం కల్పించింది. రద్దీ వేళల్లో రిజర్వేషన్ దక్కని ప్రయాణీకులకు వెసులుబాటు కలిగించేలా తాజా నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం రైల్వే రిజర్వేషన్ ఛార్ట్ వేళల్లో మార్పులు చేసిన రైల్వే శాఖ.. ఇప్పుడు ఈ ప్రధాన ఎక్సె ప్రెస్ లో ప్రయాణీకులకు అందుబాటులో ఉండే విధంగా కొత్తగా కరెంట్ బుకింగ్ సౌకర్యం పైన నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా ఈ రైళ్లల్లో తత్కాల్ కోటాను సవరించినట్లు అధికారులు వెల్లడించారు.
రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లకు సంబంధించి కీలక అప్డేట్ అందింది. ఈ రైళ్లకు కరెంట్ బుకింగ్ సౌకర్యాన్ని రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. 12747 గుంటూరు - వికారాబాద్ పల్నాడు ఎక్స్ ప్రెస్ కు నడికూడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, సనత్ నగర్, లింగపల్లిలో కరెంట్ బుకింగ్ సౌకర్యాన్ని ఏప్రిల్ 2 నుంచి అమలు చేయనుంది. అదే విధంగా 12748 వికారాబాద్ - గుంటూరు పల్నాడు ఎక్స్ ప్రెస్ కు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లిలో కరెంట్ బుకింగ్ అమలు చేసేందుకు నిర్ణయించింది. అదే విధంగా తల్కాల్, ప్రీమియం తత్కాల్ కోటాలను కూడా సవరించింది. కాగా, సింహాద్రి..జన్మభూమి..గోల్కొండ.. వయా వరంగల్ ఇంటర్ సిటీ, ఛత్రపతి శంభాజీ నగర్ - గుంటూరు ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఇదే విధంగా కరెంట్ రిజర్వేషన్ అందుబాటులోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తత్కాల్ కేటాయింపులోనూ సవరణలు
ఈ తాజా నిర్ణయం ద్వారా ఈ రైళ్లు బయలు దేరటానికి గంట మందు కూడా మిగిలిపోయిన టికెట్ లు బుకింగ్ లోకి వస్తాయని వెల్లడించారు. అదే విధంగా ఇప్పుడు IRCTC 'కరెంట్ టికెట్ సిస్టమ్' పేరుతో రైలు కొద్ది మంది ప్రయాణీకులు అనివార్య కారణాలతో చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారు. కాగా, రిజర్వేషన్ ఛార్ట్ పైన రైల్వే శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రయాణీకు లకు ప్రయోజన కరంగా మారింది. ఈ కొత్త సౌకర్యం ప్రకారం ప్రయాణికులు రైలు ప్రయాణ సమయానికి నాలుగు గంటల ముందు నుంచి ఆఖరి చార్ట్ (సాధారణంగా ఇది రైలు బయలు దేరడానికి 30 నిమిషాల ముందు ఉంటుంది) తయారు చేసే వరకు రిజర్వేషన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ కరెంట్ బుకింగ్ టికెట్లను ఆన్లైన్లో, ఆయా స్టేషన్లలోని కరెంట్ రిజర్వేషన్ కౌంటర్లలో తీసుకోవచ్చు. ఈ టికెట్లకు సాధారణ చార్జీలే తప్ప ఎలాంటి అదనపు రుసుం తీసుకోరు. ఏసీ, స్లీపర్ సహా అన్ని తరగతులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications