పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా రైల్వే ఈ మధ్య కాలంలో కొత్త మార్పులు తీసుకొస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే సదుపాయాల కల్పన విషయంలో ప్రాధాన్యత పెరిగింది. కొత్తగా వందేభారత్ రైళ్ల కేటాయింపు పైన కసరత్తు జరుగుతోంది. రైల్వే శాఖ కొత్తగా ప్రారంభించిన వందేభారత్ స్లీపర్ త్వరలోనే ఒకటి మనకు కేటాయించనున్నారు. కాగా, ఇదే సమయంలో పల్నాడు, సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రయాణీకులకు తాజాగా రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కీలక మార్పులు తీసుకొచ్చింది.
రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. నిత్యం రద్దీగా నడిచే పల్నాడు, సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లల్లో తాజాగా మరో సదుపాయం కల్పించింది. గుంటూరు- వికారాబాద్ మధ్య నడిచే పల్నాడు ఎక్స్ప్రెస్ తో సహా గుంటూరు- విశాఖ మధ్య నడుస్తున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ లో ఇప్పటి వరకు ఏసీ ఛైర్ కార్, సెకండ్ సిట్టింగ్ సదుపాయం మాత్రమే ఉంది. నిత్యం ఈ రెండు రైళ్లల్లో అటు సికింద్రాబాద్, ఇటు విశాఖ వెళ్లే వారు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తారు.

ఈ రైళ్లు ప్రారంభం నుంచి ఆక్యుపెన్సీ రేషియా ఎక్కడా తగ్గలేదు. ఈ రెండు రైళ్ల హాల్టింగ్ స్టేషన్లు ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉండటంతో వీటిల్లో ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో, ఈ రెండు రైళ్ల కు వస్తున్న ఆదరణ.. ప్రయాణీకుల డిమాండ్ మేరకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ కొత్త నిర్ణయం వచ్చే వారం నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
రైల్వే శాఖ తాజా నిర్ణయంతో
ఇప్పటి వరకు ఈ రెండు రైళ్లల్లో ఛైర్ కార్, సెకండ్ సీటింగ్ మాత్రమే అందుబాటులో ఉండటంతో సీనియర్ సిటిజెన్స్, మహిళలు కూర్చొని ప్రయాణం చేయాల్సి రావటం ఇబ్బంది కరంగా మారుతోంది. దీంతో.. ఈ రెండు రైళ్లల్లో కొత్తగా త్రీటైర్ ఏసీ కోచ్ అదనంగా ఏర్పాటు చేస్తూ తాజాగా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి పల్నాడు ఎక్స్ప్రెస్ లో, అదే విధంగా 24, 25 తేదీల నుంచి సింహాద్రి ఎక్స్ప్రెస్ కి 3 ఏసీ బోగీ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి రిజర్వేషన్ సౌకర్యం ప్రారంభిస్తున్నారు.
దీని ద్వారా ఈ రెండు రైళ్లల్లో ఇక సీనియర్ సిటిజెన్స్ ప్రయాణం లో వెసులు బాటు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రైళ్లకు ప్రస్తుతం ఒక త్రీ టైర్ ఏసీ కోచ్ ఏర్పాటు చేస్తున్నఅధికారులు... ప్రయాణీకుల నుంచి వచ్చే డిమాండ్ కు అనుగుణంగా మరిన్ని పెంపు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
-
ఐఆర్సీటీసీలో 3 కోట్ల ఫేక్ ఖాతాల తొలగింపు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!













Click it and Unblock the Notifications