వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చూడొద్దు: రాజయ్య

|
Google Oneindia TeluguNews

Rajaiah fires at Ponnala Laxmaiah
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా ఉన్న సమయంలో పొన్నాల లక్ష్మయ్య నీళ్లు, నిధులు ఆంధ్రావాళ్లకు దోచిపెట్టారని ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని చెప్పారు. రూ. 19వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసినట్లు తెలిపారు. నిరుపేదలకు భూములను పంచుతున్నారని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి.. తెలంగాణలో అదనంగా ఎకరం కూడా సాగులోకి తేలేదని రాజయ్య అన్నారు.

హెల్త్ యూనివర్సిటికీ వరంగల్‌లో ఎక్కువ భూములున్నాయన్నారు. తనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా చూడవద్దని రాజయ్య అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి తనకు తండ్రి లాంటి వారని ఉప ముఖ్యమంత్రి రాజయ్య అన్నారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇష్టమొచ్చినట్లు హామీలివ్వొద్దని, సాధ్యమయ్యే హామీలే ఇవ్వాలని.. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని కెసిఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాజయ్యను పదవి నుంచి తొలగిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే అలా ఏమి జరగలేదు.

English summary
Telangana Deputy CM Rajaiah on Saturday fired at Telangana PCC Chief Ponnala Laxmaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X