రాజేష్ మగాడంటే నమ్మేదే లేదు, తొలిరాత్రే చెప్పాడు: శైలజ తండ్రి
Recommended Video

హైదరాబాద్: శాడిస్టు భర్త బెయిల్పై విడుదల కావడంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది. పటుత్వ పరీక్షల్లో శైలజ భర్త రాజేష్ పాసైనట్లు తేలడంతో కేసు విచారణ ఇక ముందు ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.
రాజేష్ పటుత్వ పరీక్షల్లో నెగ్గడంతో కేసు పరిష్కారమైనట్లు కాదని శైలజ తల్లిదండ్రులు అంటున్నారు. తమ కూతురు శైలజను అతను చావు దెబ్బలు కొట్టడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నట్లు వారు తెలిపారు.

తొలిరాత్రినే కాళరాత్రి చేశాడు..
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురుని రాజేశ్ చేతిలో పెట్టామని, అతను ఆమెకు తొలిరాత్రినే కాళరాత్రిగా మార్చేశాడని శైలజ తల్లిదండ్రులు అంటున్నారు. రాజేష్పై పెట్టిన గృహహింస కేసును తాము ఉపసంహరించుకోబోమని స్పష్టం చేస్తున్నారు.

డాక్టర్లు నివేదిక ఇచ్చినంత మాత్రాన
ప్రలోభాలకు గురి చేసి రాజేష్ పటుత్వ పరీక్షల్లో నెగ్గి ఉండవచ్చునని శైలజ తండ్రి మునికృష్ణా రెడ్డి అంటన్నారు. డాక్టర్లు నివేదికలు ఇచ్చినంత మాత్రాన తాము నమ్మబోమని ఆయన అన్నారు.

అతను వాగ్దానం చేయించుకున్నాడు
తనకు లైంగిక పటుత్వం లేదని బయట చెప్పవద్దని శైలజతో రాజేష్ వాగ్దానం చేయించుకున్నాడని మునికృష్ణా రెడ్డి అన్నారు. ఆ రోజు తాను గదిలోకి వెళ్లి ఎందుకు ఇలా చేశావని రాజేష్ు అడిగానని, అయితే తానేమీ చేయలేదని చెప్పాడని ఆయన అన్నారు.

రాజేష్ ఇలా చెప్పాడని..
నిశ్చితార్థం అయినప్పటి నుంచి సంసార జీవితంపై పుస్తకాలు చదువుతున్నట్లు రాజేష్ చెప్పాడని మునికృష్ణా రెడ్డి చెప్పారు ఇప్పుడు అతను మగాడంటే ఎలా నమ్మాలని అని ఆయన మీడియాతో అన్నారు.












Click it and Unblock the Notifications