జగన్కు మతి తప్పింది: రావెల ఫైర్
చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని మంత్రి రావెల కిశోర్ బాబు అన్నారు. చంద్రబాబు పాలన చూసి ఇతర పార్టీల నేతలు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో ఆ పార్టీ అధినేత జగన్కు దిగులుపట్టుకుందన్నారు. ఈ దిగులుతోనే జగన్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎలా కూలిపోతుందన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదన్నారు.












Click it and Unblock the Notifications