శ్రీవారికి రూ.13.50కోట్లు విరాళంగా ఇచ్చిన ఎన్నారై భక్తులు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఇద్దరు ప్రవాస భారతీయులు భారీ మొత్తంలో విరాళాలు అందజేశారు. అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్కు చెందిన రవి, శ్రీనివాస్ అనే భక్తులు శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామి వారి వివిధ ట్రస్టులకు రూ.13.50 కోట్ల విరాళాన్ని వారు సమర్పించారు. ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్రెడ్డి సమక్షంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్యాదవ్కు విరాళానికి సంబంధించిన చెక్కులను దాతలు అందజేశారు.

టీటీడీ అధికారులు దాతలను సత్కరించి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఒకేసారి భారీ మొత్తంలో నగదు విరాళం ఇచ్చిన భక్తుడిగా రవి రికార్డు ఎక్కారు. రవి రూ.10కోట్లు విరాళంగా అందించగా, శ్రీనివాస్ రూ. 3.50కోట్లు విరాళంగా అందించారు.

అమెరికాలోని ఆర్ఎక్స్ అడ్వాన్స్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ఫౌండర్, సీఈఓగా రవి కొనసాగుతుండగా, జేసీజే టెక్నాలజీస్ సీఈఓగా శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications