ఎర్రచందనం స్మగ్లర్లు: పొరపాటున పోలీసులకే ఫోన్ చేసి దొరికిపోయారు
చిత్తూరు: ఓ ఎర్రచందనం స్మగ్లరు తన పొరపాటుతో పోలీసులకు దొరికిపోయాడు. ఒకరికి ఫోన్ చేయబోయి మరొకరికి ఫోన్ చేయడంతో అతని సంకెళ్లు పడ్డాయి. ఎర్రచందనం దుంగలను విక్రయించే క్రమంలో స్మగ్రల్లు చేసిన ఫోన్ కాల్ పోలీసులకు వెళ్లింది. దీంతో అసలుకే మోసం వచ్చింది.
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం అగ్రహారం గ్రామంలో కొందరు స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను దాచి ఉంచారు. ఓ ఇంట్లో దాచి ఉంచిన దుంగలను విక్రయించేందుకు ప్రయత్నించారు. తమ ప్రయత్నంలో భాగంగా కొంత మంది కొనుగోలుదార్లకు ఫోన్ చేశారు.

వీటిలో ఓ ఫోన్ కాల్ పొరపాటున పోలీసు అధికారులకు వెళ్లింది. దీంతో పోలీసులు పథకం ప్రకారం స్మగ్లర్లకు ఏ విధమైన అనుమానం రాకుండా అగ్రహారంపై దాడి చేశారు. అక్రమంగా దాచి ఉంచిన ఒక టన్ను బరువు గల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
More From
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications