అంగుళం ఇవ్వం, సిఎం మాట నిజమే: రేణుకా చౌదరి
ఖమ్మం: భద్రాచలాన్ని తెలంగాణలోని ఉంచాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు నాయకురాలు రేణుకా చౌదరి శనివారం కారు ర్యాలీ చేపట్టారు. యాత్ర నాయకగూడెం నుంచి ప్రారంభమైంది. భద్రాచలం వరకు ఈ రోడ్ షో సాగుతుంది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని ఆమె అన్నారు. భద్రాచలం డివిజన్లోని ఒక్క అంగుళం భూమిని కూడా సీమాంధ్రలో కలపడానికి తాము అంగీకరించబోమని ఆమె చెప్పారు. భద్రాచలం కోసం ఏ త్యాగానికైనా తాను సిద్ధమని ఆమె చెప్పారు. హైదరాబాద్పై ఇంకా ఓ నిర్ణయమూ జరగలేదని ఆమె చెప్పారు.
రాయల తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకమని రేణుకా చౌదరి కారు ర్యాలీ సందర్భంగా అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆమె బాసటగా నిలిచారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని గానీ పార్టీ అధిష్టానాన్ని గానీ ధిక్కరించడం లేదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటల్లో కొంత నిజం ఉందని ఆమె అన్నారు. తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆమె చెప్పారు.

విభజన వల్ల తలెత్తే సమస్యలను మాత్రమే ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నారని, ఆ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంపూర్ణంగా సహకరిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసు తెలంగాణ జైత్యయాత్రలకు తనకు పిలుపు రాలేదని, అందుకే వెళ్లలేదని ఆమె స్పష్టం చేసారు. తనను ఎఐసిసి అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించారనే మాటలో వాస్తవం లేదని ఆమె అన్నారు.
రేణుకా చౌదరి ఇటీవల కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ను ఢిల్లీలో కలిశారు. భద్రచలాన్ని తెలంగాణలో ఉంచాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. భద్రాచలం తెలంగాణలోనిదేనని ఆమె అన్నారు. ఇటీవల ఆమెను ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి నాయకులు కలిసి భద్రాచలంపై వినతిపత్రం సమర్పించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications