ఏపీలో మొత్తం మారిపోయిన సీన్..గెలుపు ఆ పార్టీదే తేల్చిసిన సర్వే
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీని ఓడించడానికి రాజకీయ పార్టీలన్నీ ఏకం అయిన పరిస్థితి. జగన్ ప్రత్యర్థులందరూ చేతులు కలుపుతున్న వైనం ఏపీ ముఖచిత్రంలో కనిపిస్తోంది. జగన్ను ఢీ కొట్టడానికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు జత కట్టాయి. మూడు పార్టీలు జగన్ ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. మరోవైపు ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన తమదే గెలుపని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ వేదికగా సీఎం జగన్పై రాయి దాడి జరగడంతో రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. జగన్కు వస్తోన్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీల నేతలు ఇలా దాడులకు తెగబడుతున్నారని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ వారే ఇలా దాడులు చేయించుకుని సింపతి క్రియేట్ చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు.

ఇదిలా ఉంటే సర్వేలు మొత్తం కూడా వైసీపీదే అధికారమని తేల్చి చెబుతున్నాయి. మెజారిటీ సర్వేలు వైసీపీకే పట్టం కడుతున్నాయి. 15 సర్వేల ఫలితాలు విడుదలైతే 12 సర్వేలు వైసీపీదే మళ్లీ అధికారమని తేల్చి చెబుతున్నాయి. ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ , సీ - ఓటర్ సర్వేలను మినహాయిస్తే మిగిలిన సర్వేలన్నీ వైసీపీ తిరిగి గెలవడం ఖాయమని తేల్చేశాయి. తాజాగా ఏపీ రాజకీయాలకు సంబంధించిన మరో సర్వే బయటకు వచ్చింది. ప్రముఖ జర్నలిస్ట్ రేణుక పోతినేని తమ సర్వే నివేదికను వెల్లడించారు.
Excited to share the results of our recent survey on the upcoming Andhra Pradesh elections! A big thank you to all who took the time to participate - your voices matter!#RenukaPothineni#AndhraPradeshElections pic.twitter.com/nAVA9gedUw
— Renuka Pothineni (@RenukaPothineni) April 13, 2024
జర్నలిస్ట్ రేణుక పోతినేని చేసిన సర్వేలో వైసీపీ 134 సీట్లు గెల్చుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని ఆమె తెలిపారు. కూటమి 41 సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. వైసీపీకి 52 శాతం ఓటు బ్యాంక్తో 134 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని జర్నలిస్ట్ రేణుక పోతినేని సర్వే చెబుతోంది. మహిళలు 58 శాతం , పురుషులు 42 శాతం వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఆ సర్వే ద్వారా తేలింది.కూటమికి 45 సీట్లు కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చిసింది. అయితే ఈ సర్వేను టీడీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఇది వైసీపీ అనూకుల సర్వే అంటూ కూటమి నేతలు పెదవి విరుస్తున్నారు.
-
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్కు స్టేషన్ బెయిల్ మంజూరు.. -
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ .. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ












Click it and Unblock the Notifications