పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకల రిహార్సల్స్(పిక్చర్స్)
హైదరాబాద్: గణతంత్ర వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానం ముస్తాబవుతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి వేడుకలు కావడంతో ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఫుట్పాత్లకు రంగులు వేయడంతోపాటు మైదానంలో పలు రకాల మొక్కలను ఏర్పాటు చేశారు.
ఎన్సిసి, నేవీల కేడెట్లతోపాటు పరేడ్లో పాల్గొనే ఆయా విభాగాల వారు మైదానంలో రిహార్సల్స్ చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి తెలిపారు.
గణతంత్ర వేడుకలు, భద్రతపై కమిషనరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి ఉత్సవాలు ఉదయం 10.30కు ప్రారంభమతాయన్నారు. భద్రత నేపథ్యంలో మూడు రోజుల ముందుగానే గ్రౌండ్ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
నగరంలో కార్డన్ సెర్చ్లు కూడా ఉంటాయన్నారు. హైదరాబాద్లోని అన్ని విభాగాల పోలీసు సేవలతో పాటు అదనంగా పది ప్లాటూన్ల టిఎస్ఎస్పీ బలగాల సేవలను సైతం బందోబస్తు వినియోగించుకుంటున్నట్టు తెలిపారు. ఉత్సవాల రోజున ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు చెప్పారు.

రిహార్సల్స్
గణతంత్ర వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానం ముస్తాబవుతోంది.

రిహార్సల్స్
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి వేడుకలు కావడంతో ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

రిహార్సల్స్
ఫుట్పాత్లకు రంగులు వేయడంతోపాటు మైదానంలో పలు రకాల మొక్కలను ఏర్పాటు చేశారు.

రిహార్సల్స్
ఎన్సిసి, నేవీల కేడెట్లతోపాటు పరేడ్లో పాల్గొనే ఆయా విభాగాల వారు మైదానంలో రిహార్సల్స్ చేస్తున్నారు.

రిహార్సల్స్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి తెలిపారు.

రిహార్సల్స్
గణతంత్ర వేడుకలు, భద్రతపై కమిషనరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి ఉత్సవాలు ఉదయం 10.30కు ప్రారంభమతాయన్నారు.












Click it and Unblock the Notifications