ఎన్టీఆర్ అభిమానులను ఏడిపిస్తోందా..? ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్: టిడిపి లో కొత్త టెన్షన్
వర్మ ముందే హెచ్చరించారు. అలాగే ట్రైలర్ రిలీజ్ చేసారు. నిజంగా ఎన్టీఆర్ అభిమానులను బాధించేలా చరిత్రలో జరిగిన సన్నివేశాలను కళ్లకు కట్టారు. ఈ ట్రైలర్ నిజంగానే ఎన్టీఆర్ అభిమానులను ఏడిపిస్తోందా. ఇదే సమయంలో టిడిపి లోనూ టెన్షన్ మొదలైంది. వైశ్రాయ్ ఎపిసోడ్ ను ట్రైలర్ లో హైలైట్ చేసిన వర్మ..ఇక సినిమా లో ఎలా చూపిం చారో అనేద అసలైన ఉత్కంఠ.. దీనికి తోడు ట్రైలర లో నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నమ్మడం అంటూ చేసిన చెప్పిన డైలాగ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది..
ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. నమ్మితేనే కదా మోసం చేసేది అంటూ మొదలైన ట్రైలర్ నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం అంటూ ముగుస్తుంది. 1989 ఎన్నికలలో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అనే విషయాలను ట్రైలర్లోనే వర్మ చూపించే ప్రయత్నం చేసారు.

ఆర్జీవి ట్వీట్ లు నిజమయ్యాయా..
ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు ముందే వర్మ ఆసక్తి కర ట్వీట్లు చేసారు. రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళ లో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉం డండి. రేపు మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు అంటూ వర్మ ట్వీట్ చేసారు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో చూపించని ఎన్నో నిజాలు తన సిని మా లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఉంటాయని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వైశ్రాయ్ ఎపిడోస్ లో ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన సీన్ చూసిన తరువా ప్రతీ ఎన్టీఆర్ అభిమాని కన్నీళ్లు పెట్టాల్సిందే..

టిడిపి లో కలవరం..
ఇక ఈ ట్రైలర్ లో ఆర్జీవి ప్రధానంగా ఎన్టీఆర్ -లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ లో బ్యాక్ గ్రౌండ్ డైలాగులు కొన్ని చేర్చారు. అదే సమయంలో వైశ్రాయ్ వద్దకు లక్ష్మీ పార్వతి తో కలసి వెళ్లిన ఎన్టీఆర్ పై టిడిపి నేతలే చెప్పులతో దాడి చేసిన ఘటన హైలైట్ గా నిలిచింది. దీనికి కొనసాగింపుగా ఎన్టీఆర్ పాత్ర ధాని కన్నీళ్లు కార్చటం..చివర్లో నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం అంటూ చెప్పిన డైలాగ్ పరమార్ధం పై టిడిపిలో కలవరం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సిని మా తొలి పాట పై టిడిపి నేతలు కోర్టుకెక్కారు. బాలకృష్ణ తీసిని కధానాయకుడు అంత సక్సెస్ కాకవపోటం..ఇప్పుడు ఎన్నికల వేళ..ఈ సినిమా విడుదల కావటంతో ఎన్టీఆర్ అభిమానులు ఒక రకమైన భావోద్వేగానికి గురి కావటం కూడా టిడిపి నేతల్లో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications