తెలంగాణ అన్యాయం చేస్తున్నా! బాబు నోరు మెదపరు: రోజా ఫైర్
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. రాయలసీమకు అన్యాయం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
పాదయాత్రగా వచ్చిన రోజా.. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ... గాలేరు నగరి ప్రాజెక్ట్ సాధనకు 88 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు.

అలాగే ఈ ప్రాజెక్ట్పై ప్రభుత్వం స్పందించాలన్నారు. త్వరితగిన ప్రాజెక్టును పూర్తి చేయకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న పట్టిసీమ ద్వారా రాయలసీమకు చుక్కనీరు రాలేదని రోజా అన్నారు.
కాగా, శ్రీవారి దర్శనానికి తనకు టికెట్లు ఇవ్వాలని కోరినా టీటీడీ పక్షపాతంతో నిరాకరించిందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, రోజా టీటీడీ నిబంధనలు అతిక్రమిస్తూ రాజకీయ ప్రసంగం చేసినప్పటికీ టీటీడీ కాని, విజిలెన్స్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కానీ ఆమెకు అడ్డుచెప్పకపోవడం గమనార్హం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications