రోజా సైలెంటయ్యారు! ఎందుకంటే..?: అంతా ఆ ప్రభావమేనా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు.
Recommended Video

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో, అంతకుముందుకు కూడా తరచూ అధికార పార్టీ, సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే రోజా ఈ మధ్య మీడియాలో కనిపించకపోవడం చర్చకు దారితీసింది.

రోజా సైలెంట్ కావడానికి అదే కారణమా..?
కాగా, రోజా ఇలా సైలెంట్ అయిపోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమెను సైలెంట్గా ఉండమన్నారా? అనే సందేహం కలుగుతోంది.

ఓటమికి రోజా వ్యాఖ్యలే కారణం...?
ఎన్నికలలో వ్యతిరేక ఫలితాలు రావడానికి రోజా చేసిన వ్యాఖ్యలే కారణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రచారం సందర్భంగా అభ్యంతరకర పదజాలాన్ని వాడటమే కాకుండా, మంత్రి అఖిలప్రియ చుడీదార్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీకి ఓట్లను దూరం చేశాయనే భావన పార్టీ నేతల్లో ఉందట.

కొంత కాలం తప్పదు..
ఈ నేపథ్యంలో కొంత కాలం పాటు సెలెంట్గా ఉండాలంటూ పార్టీ అధిష్టానం రోజాకు సూచించినట్లు సమాచారం. దీంతో రోజా ప్రస్తుతం తన నియోజకవర్గం నగరిపైనే దృష్టి సారిస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, ప్రజల మధ్య గడుపుతున్నారు.

నిరాశలో..
ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వైయస్ జగన్ తోపాటు రోజా, ఇతర నేతలు నంద్యాలలో పర్యటించి విస్తృత ప్రచారం చేశారు. కానీ, నంద్యాల, కాకినాడ ఓటర్లు మాత్రం టీడీపీకే మొగ్గుచూపారు. దీంతో వైసీపీ శ్రేణులు కొంత నిరాశకు గురయ్యాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications