రోజా సైలెంటయ్యారు! ఎందుకంటే..?: అంతా ఆ ప్రభావమేనా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు.
Recommended Video

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో, అంతకుముందుకు కూడా తరచూ అధికార పార్టీ, సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే రోజా ఈ మధ్య మీడియాలో కనిపించకపోవడం చర్చకు దారితీసింది.

రోజా సైలెంట్ కావడానికి అదే కారణమా..?
కాగా, రోజా ఇలా సైలెంట్ అయిపోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమెను సైలెంట్గా ఉండమన్నారా? అనే సందేహం కలుగుతోంది.

ఓటమికి రోజా వ్యాఖ్యలే కారణం...?
ఎన్నికలలో వ్యతిరేక ఫలితాలు రావడానికి రోజా చేసిన వ్యాఖ్యలే కారణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రచారం సందర్భంగా అభ్యంతరకర పదజాలాన్ని వాడటమే కాకుండా, మంత్రి అఖిలప్రియ చుడీదార్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీకి ఓట్లను దూరం చేశాయనే భావన పార్టీ నేతల్లో ఉందట.

కొంత కాలం తప్పదు..
ఈ నేపథ్యంలో కొంత కాలం పాటు సెలెంట్గా ఉండాలంటూ పార్టీ అధిష్టానం రోజాకు సూచించినట్లు సమాచారం. దీంతో రోజా ప్రస్తుతం తన నియోజకవర్గం నగరిపైనే దృష్టి సారిస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, ప్రజల మధ్య గడుపుతున్నారు.

నిరాశలో..
ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వైయస్ జగన్ తోపాటు రోజా, ఇతర నేతలు నంద్యాలలో పర్యటించి విస్తృత ప్రచారం చేశారు. కానీ, నంద్యాల, కాకినాడ ఓటర్లు మాత్రం టీడీపీకే మొగ్గుచూపారు. దీంతో వైసీపీ శ్రేణులు కొంత నిరాశకు గురయ్యాయి.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications