అసెంబ్లీ నుంచి వేటు: హైకోర్టు డివిజన్ బెంచ్కెక్కిన రోజా
హైదరాబాద్: తన సస్పెన్షన్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఈ నెల 9కి వాయిదా వేయడాన్ని ప్రశ్నిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ మంగళవారం వాదనలు విన్పించారు.
రోజా సస్పెన్షన్పై దాఖలైన వ్యాజ్యంలో శాసన వ్యవహారాల శాఖ, అసెంబ్లీ కార్యదర్శులు కౌంటర్లు దాఖలు చేయకుండా వాయిదా కోరారని, ఈ నెల 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున 9వ తేదీకి వాయిదా వేయడం వల్ల పిటిషనర్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కోల్పోతారని తెలిపారు.
కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఏదో ఒక సాకుతో వాయిదా కోరుతున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం సభ నుంచి సస్పెండ్ చేసే అధికారం ఒక సెషన్కు మాత్రమే పరిమితం చేయాలన్నారు.

దానిపై అదనపు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల 17న ఇచ్చిన నోటీసులు అసెంబ్లీ కార్యదర్శికి 24న అందాయని, వాదనలు చెప్పాలని తనను కోరారని, ఆ విషయాన్నే కోర్టుకు చెప్పి వాయిదా కోరానని తెలిపారు.
ఆర్టికల్ 194(3) ప్రకారం సభా మర్యాదలు పాటించని సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేయవచ్చని చెప్పారు. ఈ వాదనలు విన్న హైకోర్టు సింగిల్ జడ్జి ముందున్న కేసు విచారణను 9వ తేదీ కంటే ముందుగానే చేపట్టాలని కోరతామని స్పష్టం చేస్తూ విచార ణను ఈనెల 3వ తేదీకి వాయిదా వేసింది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో












Click it and Unblock the Notifications