పెళ్లి రోజు సందడి: సెల్వమణితో రోజా ఇలా, స్వీట్ తినిపించి జగన్ ఆశీర్వాదం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా-సెల్వమణి దంపతులు తమ వివాహ రోజు వేడుకలను ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.
నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా-సెల్వమణి దంపతులు తమ వివాహ రోజు వేడుకలను ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.
స్వీట్ తినిపించిన జగన్..
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డితో తమ దంపతులిద్దరూ దిగిన ఫొటోపాటు పెళ్లి నాటి ఫొటోలను కూడా సోషల్ మీడియాలో రోజా పంచుకున్నారు. తమ 15వ వివాహ వార్షికోత్సవ రోజు రోజా దంపతులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.
Recommended Video
పెళ్లి రోజు శుభాకాంక్షలు
ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి.. రోజాకు స్వీట్ తినిపించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రోజా దంపతులకు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సందడిగా రోజా దంపతులు..
రోజా ఈ రోజు ఫేస్బుక్ డీపీ కూడా సెల్వమణితో దిగిన ఫొటోను పెట్టడం గమనార్హం. బ్యాక్గ్రౌండ్ ఫొటో కూడా సెల్వమణి రోజాకు పూల మాల వేస్తున్న ఫొటోను పెట్టారు. ఈ ఫొటోలు రోజా కుమారుడు, కూతురు కూడా ఉన్నారు.
ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తూ..
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైయస్ జగన్ తోపాటు రోజా కూడా విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తూ ప్రచారంలో రోజా సంచలనంగా మారారు. కాగా, సోమవారమే ఎన్నికల ప్రచారానికి ముగింపు కావడంతో వేగంగా తమ ప్రచారాన్ని కొనసాగించారు.