"రోజా ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి.. అక్కడ అందరూ సమానమే"
తిరుమల: వైసీపీ ఎమ్మెల్యే రోజా అతి చేస్తున్నారని, ఇకనైనా ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. అనుచరులతో తిరుమలకు వెళ్లిన రోజా ఎల్-1 టికెట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారని, దేవుడి ముందు అందరూ సమానమేనన్న సంగతి తెలుసుకోవాలని చెప్పారు.
జేఈవో శ్రీనివాసరాజు ప్రభుత్వానికి సూట్కేసులు అందిస్తున్నారని, అందుకే ఆయన ఏడేళ్లుగా ఆ పదవిలో ఉన్నారని తిరుమలను సందర్శించిన సందర్భంగా రోజా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కూడా రాజేంద్రప్రసాద్ స్పందించారు.
Recommended Video
నేను అడిగితే ఇవ్వరా: తిరుమలలో రోజా సంచలన వ్యాఖ్యలు, బైక్లపై అనుచరుల హడావుడి
అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఎస్వీబీసీలో అక్రమాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, దీనిపై టీటీడీ అధికారులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉందన్నారు. ఈవో సింఘాల్ గట్టి చర్యలు తీసుకుంటున్నారని రాజేంద్రప్రసాద్ చెప్పారు.