వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలా! బాబు ఎంత నీచుడో తెలుసుకో, తెల్లారే వైయస్ మృతి: రోజా సంచలనం

అఖిలప్రియా! ఈ విషయాలు తెలుసుకో అంటూ వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం నాడు నిప్పులు చెరిగారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: అఖిలప్రియా! ఈ విషయాలు తెలుసుకో అంటూ వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం నాడు నిప్పులు చెరిగారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

అఖిలప్రియా! కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలి: రోజా, నీకే తెలివి ఉంటే: జగన్‌పై టిడిపిఅఖిలప్రియా! కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలి: రోజా, నీకే తెలివి ఉంటే: జగన్‌పై టిడిపి

బాబు తిట్టిన తెల్లారే వైయస్ చనిపోయడు

బాబు తిట్టిన తెల్లారే వైయస్ చనిపోయడు

చంద్రబాబు నాయుడు హెచ్చరించిన మరుసటి రోజే వైయస్ రాజశేఖర రెడ్డి గారి ప్రాణాలు గాలిలో కలిశాయని రోజా అన్నారు. అలాగే, చాలాసార్లు జగన్‌ను ముఖ్యమంత్రి హెచ్చరించారని చెప్పారు. తనతో పెట్టుకున్న వారు ఎవరూ బతికి బట్ట కట్టలేదని చంద్రబాబు అన్నారని రోజా అగ్రహించారు.

Recommended Video

Chandrababu Gave Promise to Bhuma Akhila Priya Over Nandyal MP
అఖిలప్రియా తెలుసుకో!

అఖిలప్రియా తెలుసుకో!

మంత్రి అఖిలప్రియ ఇష్టారీతిన మాట్లాడుతోందని రోజా మండిపడ్డారు. ఆమెను నేను సూటిగా అడుగుతున్నానని, శోభా నాగిరెడ్డిని వైసిపి మొత్తం గౌరవిస్తోందని, కానీ మీరు ఆమె ఆశయాలకు ఎందుకు తూట్లు పొడిచారని ప్రశ్నించారు. శోభా పీఆర్పీ నుంచి వచ్చినప్పుడు రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరారని చెప్పారు. ఇప్పుడు తల్లి ఆశయాలను ఆమె తుంగలో తొక్కారన్నారు.

భూమా కుటుంబానికి మూడు టిక్కెట్లు ఇచ్చిన ఘనత

భూమా కుటుంబానికి మూడు టిక్కెట్లు ఇచ్చిన ఘనత

భూమా కుటుంబానికి మూడు టిక్కెట్లు ఇచ్చిన ఘనత జగన్‌దే అని రోజా అన్నారు. శోభా మృతి తర్వాత జగన్ కుటుంబం భూమా కుటుంబానికి అండగా ఉందని చెప్పారు. మీ అమ్మ, నాన్న ఆశయాలను నీవు తుంగలో తొక్కుతున్నావని రోజా.. అఖిలపై మండిపడ్డారు.

మీ తండ్రి చావుకు కారణం చంద్రబాబు

మీ తండ్రి చావుకు కారణం చంద్రబాబు

మీ తండ్రి భూమా నాగిరెడ్డి చావుకు చంద్రబాబు కారణమని రోజా ఆరోపించారు. అఖిలప్రియా తెలుసుకో.. మీ నాన్న భూమా నాగిరెడ్డిని చేయని తప్పుకు 14 రోజులు ఈ ప్రభుత్వం జైల్లో పెట్టిందన్నారు. రౌడీషీట్ తెరిచిందన్నారు. ఈ విషయాలు తెలుసుకోవాలన్నారు.

చంద్రబాబు ఎంగిలి మెతుకుల కోసం

చంద్రబాబు ఎంగిలి మెతుకుల కోసం

చంద్రబాబు నాయుడు వేసే ఎంగిలి మెతుకుల మీ తల్లిదండ్రుల ఆశయాలను పక్కన పెడతావా అని అఖిలప్రియను రోజా ప్రశ్నించారు. టిడిపి నేతలు పిచ్చిప్రేలాపనలు పేలుతున్నారని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబును, లోకేష్‌ను, టిడిపిని ప్రజలు బంగాళాఖాతంలో కలపాలన్నారు. చంద్రబాబ ఓటర్లను బెదిరిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. రౌడీలా ఆయన మాటలు ఉన్నాయన్నారు. గవర్నమెంటు అధికారులపై దాడులు చేయిస్తున్నారన్నారు.

చంద్రబాబు ఎంత నీచుడో చెప్పాలా

చంద్రబాబు ఎంత నీచుడో చెప్పాలా

చంద్రబాబు ఎంత నీచుడో చెప్పాలా అని రోజా ధ్వజమెత్తారు. నడిరోడ్డుపై వంగవీటి రంగాను హత్య చేయించారన్నారు. రాజారెడ్డిని చంపిన వారికి ఆశ్రయం ఇచ్చారన్నారు. రౌడీ రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు చంద్రబాబువే అన్నారు. జగన్ మాటలను వక్రీకరిస్తున్నారన్నారు.

మంత్రులారా మూయండి! మేం మాట్లాడితే బూతులా

మంత్రులారా మూయండి! మేం మాట్లాడితే బూతులా

జగన్‌ను తిట్టడానికే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని రోజా విమర్శించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి ముందు రాజీనామా చేసి, ఆ తర్వాత మాట్లాడాలన్నారు. కేశవ రెడ్డి బాధితులకు న్యాయం చేయాలని సవాల్ చేశారు. అచ్చెన్నాయుడు మాట్లాడకుంటే మంచిదన్నారు. టిడిపి నేతలు మాట్లాడితే చాగంటి ప్రవచనాలు, వైసిపి నేతలు మాట్లాడితే బూతులా అన్నారు.

English summary
YSR Congress Party Nagar MLA Roja on friday suggested Minister Akhila Priya to know about Chandrababu Naidu history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X