ఉప ఎన్నిక షాకింగ్: ఓటుకు రూ.7వేలు: గుడివాడ కొడాలి నాని వర్సెస్ రావి
విజయవాడ: గుడివాడ మున్సిపాలిటీ 19వ వార్డు ఉప ఎన్నికను టిడిపి, వైసిపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసిపికి చెందిన వార్డు సభ్యుడు లక్ష్మణ రావు మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు డబ్బులు విరివిగా ఖర్చు పెడుతున్నాయి.
టిడిపి నుంచి రావి వెంకటేశ్వర రావు, వైసిపి నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని డబ్బులను ఏరులా పారిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

గెలుపే లక్ష్యంగా ఓ వర్గం ఓటుకు రూ.7వేల వరకు ఇస్తుంటే, మరో వర్గం ఓటుకు రూ.6వేలతో పాటు వెండి కుంకుమ భరిణులు పంపిణీ చేస్తోంది. 2902 ఓట్లు ఉన్న ఈ వార్డులో ఒక్కో అభ్యర్థి రూ.కోటి చొప్పున ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
పోలింగ్ స్లిప్ చూపిస్తే డబ్బులు అందచేస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. కాగా, పోలింగ్ కేంద్రం ఎక్కువ మంది ఉండరాదని చెప్పడంతో రావి వెంకటేశ్వరరావు వర్గానికి, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications