వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నిక షాకింగ్: ఓటుకు రూ.7వేలు: గుడివాడ కొడాలి నాని వర్సెస్ రావి

|
Google Oneindia TeluguNews

విజయవాడ: గుడివాడ మున్సిపాలిటీ 19వ వార్డు ఉప ఎన్నికను టిడిపి, వైసిపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసిపికి చెందిన వార్డు సభ్యుడు లక్ష్మణ రావు మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు డబ్బులు విరివిగా ఖర్చు పెడుతున్నాయి.

టిడిపి నుంచి రావి వెంకటేశ్వర రావు, వైసిపి నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని డబ్బులను ఏరులా పారిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

<strong>16మంది రాజీనామా చేయలేదు: జగన్‌కు సుజయ షాక్, అఖిలకు స్వాగతం</strong>16మంది రాజీనామా చేయలేదు: జగన్‌కు సుజయ షాక్, అఖిలకు స్వాగతం

Rs 7,000 for vote in Gudivada municipality bypoll

గెలుపే లక్ష్యంగా ఓ వర్గం ఓటుకు రూ.7వేల వరకు ఇస్తుంటే, మరో వర్గం ఓటుకు రూ.6వేలతో పాటు వెండి కుంకుమ భరిణులు పంపిణీ చేస్తోంది. 2902 ఓట్లు ఉన్న ఈ వార్డులో ఒక్కో అభ్యర్థి రూ.కోటి చొప్పున ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

పోలింగ్ స్లిప్ చూపిస్తే డబ్బులు అందచేస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. కాగా, పోలింగ్‌ కేంద్రం ఎక్కువ మంది ఉండరాదని చెప్పడంతో రావి వెంకటేశ్వరరావు వర్గానికి, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

English summary
It is said that Telugudesam and YSR Congress Parties are giving Rs 7,000 for vote in Gudivada municipality bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X