ఉప ఎన్నిక షాకింగ్: ఓటుకు రూ.7వేలు: గుడివాడ కొడాలి నాని వర్సెస్ రావి
విజయవాడ: గుడివాడ మున్సిపాలిటీ 19వ వార్డు ఉప ఎన్నికను టిడిపి, వైసిపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసిపికి చెందిన వార్డు సభ్యుడు లక్ష్మణ రావు మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు డబ్బులు విరివిగా ఖర్చు పెడుతున్నాయి.
టిడిపి నుంచి రావి వెంకటేశ్వర రావు, వైసిపి నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని డబ్బులను ఏరులా పారిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
16మంది రాజీనామా చేయలేదు: జగన్కు సుజయ షాక్, అఖిలకు స్వాగతం
గెలుపే లక్ష్యంగా ఓ వర్గం ఓటుకు రూ.7వేల వరకు ఇస్తుంటే, మరో వర్గం ఓటుకు రూ.6వేలతో పాటు వెండి కుంకుమ భరిణులు పంపిణీ చేస్తోంది. 2902 ఓట్లు ఉన్న ఈ వార్డులో ఒక్కో అభ్యర్థి రూ.కోటి చొప్పున ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
పోలింగ్ స్లిప్ చూపిస్తే డబ్బులు అందచేస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. కాగా, పోలింగ్ కేంద్రం ఎక్కువ మంది ఉండరాదని చెప్పడంతో రావి వెంకటేశ్వరరావు వర్గానికి, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.