ఏపీలో రూ.99 కే మద్యం బాటిల్ పై తాజా అప్ డేట్..!
ఏపీలో కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి రావడంతో పాటు షాపుల కేటాయింపు లాటరీ కూడా ముగియడంతో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇందులో అన్నింటికంటే ఎక్కువగా రూ.99కే క్వార్టర్ బాటిల్ మద్యంపైనే అందరి ఫోకస్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ బాటిళ్ల మద్యం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై అధికారులు ఇవాళ క్లారిటీ ఇచ్చారు.
మద్యం షాపుల లాటరీ పూర్తి కాగానే ఎంత మేర రూ.99 క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులో ఉంటుందన్న దానిపై అధికారుల వద్ద పూర్తి అంచనాలు లేవు. దీంతో ముందు కొంత స్టాక్ తెప్పించుకుని, డిమాండ్ ను బట్టి మిగతా స్టాక్ కు ఆర్డర్ ఇవ్వాలన్న చర్చ జరిగింది. దీంతో ఇప్పుడు ఆరంభ స్టాక్ కోసం పెట్టిన ఆర్డర్ల ప్రకారం షాపులకు సరఫరా ప్రారంభమైంది. తొలుత 10 వేల కేసులకు ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తోంది.

గురువారం నాటికి 10 కేసుల ఆర్డర్ పెట్టామని, సోమవారానికి మరో 25 వేల కేసులు ఆర్డర్ పెడతామని అధికారులు తెలిపారు. అలా పెంచుకుంటూ పోతూ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని మద్యం షాపుల్లో 2 లక్షల కేసుల వరకూ ఆర్డర్ పెట్టబోతున్నట్లు చెప్తున్నారు. దీంతో పలు చోట్ల రూ.99 క్వార్టర్ బాటిల్ మద్యం కోసం మందుబాబులు డిమాండ్ చేస్తున్నారు. అయితే త్వరలోనే స్టాక్ పెడతామని సిబ్బంది వారికి జవాబు ఇస్తున్నారు.
మరోవైపు మద్యం ధరల విషయంలోనూ పారదర్శకంగా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం ఓ కమిటీని నియమించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న మద్యం బాటిళ్ల ధరలను ఈ కమిటీ సవరించి ఫైనల్ చేయనుంది. ఇందులో పాత బ్రాండ్ల ధరల సవరణతో పాటు కొత్త బ్రాండ్ల ధరల నిర్ణయం కూడా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కమిటీ నిర్ణయించిన కొత్త ధరల మేరకే విక్రయాలు జరుగుతాయి.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
కొండెక్కి కూర్చున్న కోడి ధరలు.. కొనలేమంటున్న సామాన్యులు! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications