తిరుమలలో నేడు సహస్ర కలశాభిషేకం..సంవత్సరానికి ఒకసారే..
ఆంధ్రప్రదేశ్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇక్కడికి నిత్యం భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. తిరుమలలో నేడు సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఒకరకంగా ఇది తిరుమల శ్రీవారికి ప్రత్యేక అభిషేకంగా చెప్పుకోవాలి. శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరుగనుంది. ఈ సహస్ర కలశాభిషేకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం గత 18 ఏళ్ల నుంచి నిర్వహిస్తోంది.
ఈ సహస్ర కలశాభిషాకానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వామివారికి ఆలయంలోని బంగారు వాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకులు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. సహస్ర కలశాభిషేకం అంటే 1008 పాత్రలు అభిషేక తీర్థంతో నిండి ఉండడం. పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించినట్లు ఇక్కడివారు చెబుతున్నారు. దీనికి గుర్తుగా ప్రతి ఏటా ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వెంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన ఉందని స్థానికులు చెబుతుంటారు.

ఒక్కరోజు హుండికీ భారీ ఆదాయం...
ఓ పక్క నేడు శ్రీవారికి ప్రత్యేక అభిషేకం జరుగుతుండగా.. మరోపక్క కలియుగ ప్రత్యక్షత్ర దైవమైన స్వామివారి దర్శన భాగ్యం పొందేందుకు తిరుమల కొండపై భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. ఇక, టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతుంది. నిన్న (జూన్ 15) తిరుమల స్వామివారిని సుమారు 82,886 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజు హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వివరించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications