హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రష్.. టోల్ గేట్ల వద్ద పరిస్థితి ఇలా!!
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లతో తెలుగు రాష్ట్రాల్లో బస్ స్టాండ్ లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడతాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాలలో సెటిల్ అయిన, ముఖ్యంగా హైదరాబాద్ లో సెటిల్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు తమ తమ స్వగ్రామాలకు ప్రయాణాలు సాగిస్తారు. ఈ క్రమంలో తాజాగా ఈ ఏడాది కూడా సొంతూరికి వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఉండే ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన రైళ్లను, ప్రత్యేక బస్సులను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే రోజువారి సర్వీసులలో సీట్లన్నీ నిండిపోవడంతో, ప్రత్యేక బస్సుల్లో కూడా రద్దీ కొనసాగుతోంది.

ఆర్టీసీ పెట్టిన ప్రత్యేక బస్సులు మాత్రమే కాకుండా ప్రైవేటు బస్సులలో సైతం ప్రస్తుతం రద్దీ కనిపిస్తుంది. ఈ సారి పండుగను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చెయ్యాలని భావిస్తున్న క్రమంలో జోరుగా ప్రయాణాలు చేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుండి టోల్ గేట్ ల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 53000 వాహనాలు రాకపోకలు సాగించాయని తెలుస్తుంది.
గతేడాది కంటే ఈసారి వాహనాల రద్దీ మరింత పెరిగిందని తెలుస్తుంది. కానీ ఫాస్టాగ్ తో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ నేపధ్యంలో కొద్దిగా ట్రాఫిక్ సమస్య నెలకొంది. కానీ గతంలా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయే పరిస్థితి లేదు. మరోవైపు నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద కూడా వాహనాల రద్దీ కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాలలో రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు కొనసాగుతున్న రద్దీ నేపథ్యంలో apsrtc ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసి పండుగకు ప్రయాణికులు వారి వారి సొంత ఊర్లకు వెళ్లేందుకు కృషి చేస్తోంది.
-
ప్రయాణికులకు ఆర్టీసీ తీపి కబురు.. మహిళలకు పండుగే! -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం!











Click it and Unblock the Notifications