Shashikala: రైల్వేస్టేషన్లో గాయపడిన విద్యార్థిని శశికళ మృతి..
విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడిన విద్యార్థిని శశికళ మృతి చెందింది. దువ్వాడ రైల్వేస్టేషన్లో రైలు, ప్లాట్ఫాం మధ్య ఇరుక్కున్న శశికళను గంటన్నరపాటు రెస్క్యూటీం శ్రమించి సురక్షితంగా బయటకు తీసినాగాని అంతర్గత గాయాల వల్ల ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు.
ఎంసీఏ
అన్నవరానికి చెందిన విద్యార్థిని దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. ఎప్పటిలాగే కాలేజ్ కు వెళ్ళేందుకు గుంటూరు-రాయగడ్ ఎక్స్ ప్రెస్ లో దువ్వాడ స్టేషన్ కు చేరుకుంది. రైలు దిగుతున్న క్రమంలో ఆమె కాలు రైలు, ఫ్లాట్ ఫాం మధ్యలో ఇరుక్కుపోయింది. ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుంది.

రైల్వే పోలీసులు
దీంతో సహచరులు కేకలు వేయడంతో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని రెస్క్యూటీం సహకారంతో గంటన్నర పాటు శ్రమించి బయటకు తీశారు. ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయితే యూరిన్ బ్లాడర్ దెబ్బతినడం, ఎముకలు నలిగిపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు ఆమె కాపాడానికి తీవ్రంగా కృషి చేసినప్పటికీ గురువారం మధ్యాహ్నం చికిత్సపొందుతూ మృతి చెందింది. దీంతో అన్నవరంలో విషాదఛాయలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications