Actor Suman:సుమన్ సంచలన వ్యాఖ్యలు..!
తిరుపతి: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, ప్రధాని మోదీ ఆ దిశగా ఆలోచించాలని ప్రముఖ సినీనటుడు సుమన్ కోరారు. సేవ్ కవ్-సేవ్ ఎర్త్ అనే నినాదంతో హైదరాబాదు నుంచి అరుణాచలం వరకు చేపట్టిన గో మహాపాదయాత్ర తిరుపతికి చేరుకుంది. కపిలతీర్థం సమీపం నుంచి సినీనటుడు సుమన్ గోమహాపాద యాత్రకు సంఘీభావం తెలిపి అలిపిరి వరకు పాదయాత్ర చేశారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ... ఆవును రక్షిస్తే భూమిని రక్షించినవారం అవుతాం అనడంలో చాలా అర్ధం ఉందన్నారు. అన్ని వర్గాల పజల జీవితాల్లో గోవు ప్రధాన పాత్ర పోషిస్తుందనిగుర్తు చేశారు. గోవును పూజిస్తే అంతా శుభం జరుగుతుందనేది అనాదిగా వస్తున్న విశ్వాసమని చెప్పారు.వాస్తు, గ్రహ దోషాలు ఉంటే గోవుల మూలానా తొలగిపోతాయన్నారు. గో వధను తక్షణమే మానుకోవాలని ఈ సందర్భంగా సుమన్ విజ్ఞప్తి చేశారు.

గో మాంసం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు వెల్లడించారన్నారు. గోమూత్రం, మయంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. తల్లి పాల తర్వాత గోక్షీరమే చంటిబిడ్డలకు పడ తామని గుర్తు చేశారు. ఇన్ని ఉపయోగా లున్న గోవును రక్షించాలనే భావన అందరి లోనూ ఉండాలన్నారు. విదేశాలలో గోమూ త్రాన్ని ఔషధంగా వినియోగిస్తారని, ఆవును కౌగిలించుకుంటే చర్మంపై ఉండే కనిపించని వైరస్ చనిపోతుందని, అనేక వ్యాధులు నయమవుతాయని చెప్పారు.
గో మహాపాదయాత్రలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని, ప్రజలందరి క్షేమం కోరి తాను ఈ కార్యక్ర మానికి సంఘీభావం తెలిపానని సుమన్ చెప్పారు.అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడైన బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ కలుషి తమైన ఈ భూమిని బాగుపరచాలంటే ఆవు మూత్రం, పేడ తప్పితే ప్రపంచంలో ఏ వస్తువూ ఉపయోగపడదన్నారు.

గోవులు అన్ని మతాలు, కులాల వారికి అవసరమని పేర్కొన్నారు. అలిపిరి కాలినడకన తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటా మని, ఆ తర్వాత శ్రీవారిమెట్టు ద్వారా కిందకు దిగి తమిళనాడు అరుణాచలానికి పయనమవుతామని అన్నారు. ఈనెల 31న గో మహాపాదయాత్రకు ముగింపు పులుకుతామని తెలిపారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications